S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లండన్, మే 2: భారతీయ సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాది సిద్ధార్థ ధర్ కొత్త జిహాదీ జాన్ (సీనియర్ కమాండర్)గా వ్యవహరిస్తున్నట్లు మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి. నిహాద్ బరాకత్ అనే యువతిని సిద్ధార్థ అపహరించుకుపోయి ఐసిస్లో సెక్స్ బానిసగా మార్చినట్లు ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
న్యూఢిల్లీ, మే 2: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్కు హాజరయ్యే అంధులు, మెదడు పక్షవాతం వచ్చినవారు, కీళ్లు-కండరాలకు సంబంధించిన బలహీనతలు ఉన్నవారు.. ఇకపై లేఖకుల సహకారంతో పరీక్షలు రాయొచ్చు. ఈ రకమైన వికలాంగులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహాయకులను ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని యూపీఎస్సీ కల్పించింది.
న్యూఢిల్లీ, మే 2: అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై భారత వాయుసేన (ఐఎఎఫ్) మాజీ అధినేత ఎస్పి త్యాగిని సిబిఐ సోమవారం ప్రశ్నించింది. త్యాగి ఉదయం పది గంటలకు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. భారత్కు హెలికాప్టర్లు సరఫరా చేయడానికి రూ.
న్యూఢిల్లీ, మే 2: విభజన గాయాల నుండి ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు ఎన్డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉద్యమ బాట పట్టే ప్రమాదం ఉన్నదని శ్రీనివాసరావు హెచ్చరించారు. అవంతి శ్రీనివాసరావు సోమవారం లోక్సభ జీరో అవర్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు.
వాషింగ్టన్, మే 2: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను హతమార్చి ఐదేళ్లు గడుస్తుండటంతో అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) చీఫ్ జాన్ బ్రెన్నన్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థపై దృష్టి కేంద్రీకరించారు.
వాషింగ్టన్, మే 2: భారత్లో మత సహన పరిస్థితులు క్షీణించాయని,మత స్వేచ్ఛ ఉల్లంఘనలూ పెరిగిపోయాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛ అధ్యయన నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. వివిధ మతాలకు చెందిన ప్రజలను చులకన చేస్తూ అధికారులు, మత నాయకులు చేసే ప్రకటనలు కట్టడి చేయాలని భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ, మే 2: ఉత్తరాఖండ్ అడవిని దగ్ధం చేస్తున్న దావానలం అదుపులోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం లోక్సభలో వెల్లడించారు. ఈ దావానలం కారణంగా ప్రాణనష్టం ఏదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని.. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మంటల్ని అదుపులోకి తీసుకురావటంలో సమర్థంగా పనిచేస్తోందని రాజ్నాథ్ అన్నారు. తాను కూడా పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు.
గూడూరుటౌన్,మే 2: అహ్మదాబాద్ నుండి చైనె్న వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు పరుగుకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్కు సోమవారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకు చేరుకున్న రైలు అందులో తాగునీరు,విద్యుత్ సరఫరా లేదని అగ్రహించిన ప్రయాణికులు గూడూరు స్టేషన్మాస్టర్కు ఫిర్యాదు చేయగా టిఎక్స్అర్ డిపాంట్మెంట్ను పిలిపించి సమస్యను పరిష్కరించారు.
న్యూఢిల్లీ, మే 2: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సోమవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దేశంలోని వివిధ బ్యాంకులకు ఉద్ధేశ్యపూర్వకంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన మాల్యా ఈ వ్యవహారంలో రాజ్యసభ హక్కుల కమిటీకి సమాధానం ఇవ్వాల్సిన గడువు ముగియడానికి ఒక రోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ, మే 2: నీట్ వ్యవహారంపై ఎన్డిఎ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం లోక్సభలో ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.