-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 9: ఒడిశాలో ఆదివారం జరిగిన ఘోర దుర్ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 11 కేవీ విద్యుత్ వైర్లకు బస్సు తగలడంతో షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. గంజాం జిల్లా గొలంతర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పది మంది మరణించగా, కనీసం 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బరంపూర్ సదర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జయంత్ కుమార్ మహాపాత్రో కథనం మేరకు..
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాల్లో నిర్భందంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. అలాగే పదోన్నతుల్లో కోటా కోసం పట్టుబట్టడం అన్నది ఎవరికీ ప్రాథమిక హక్కు కాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎక్స్ అఫీషియో ఓటుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తుక్కుగూడ మున్సిపాల్టీలో కేకే ఓటు వేయడంపై బీజేపీ కౌన్సిలర్లు పిటిషన్ దాఖలు చేశారు. కేశవరావు ఓటు చెల్లుబాటు కాదని ప్రకటించాలని వారు పిటిషన్లో కోరారు. కేకే ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని వారు పేర్కొన్నారు.
కురిచేడు, ఫిబ్రవరి 8: విరామ కాలంలో విహార యాత్రకు బయలుదేరిన పాఠశాల సిబ్బందికి రోడ్డు ప్రమాదం విషదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు గ్రామ సమీపంలో శనివారం ఉదయం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తాపడి 22 మంది గాయపడ్డారు. వీరిలో 7 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
కూచిపూడి, ఫిబ్రవరి 8: బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై నిడుమోలు వద్ద శనివారం చోటు చేసుకుంది. మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన మురారి రామచంద్రరావు(50) నిడుమోలులో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా బస్సు కదలటంతో కింద పడ్డాడు. అతనిపై నుండి బస్సు వెనక చక్రాలు వెళ్లడంతో కుడికాలు పూర్తిగా నుజ్జు కాగా ఎడమ కాలికి తీవ్ర గాయమైంది.
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్రేప్, హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి మళ్లీ వారంట్లు జారీ చేయాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్కు రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీలోని ఒక కోర్టు గురువారం సదరు ముద్దాయిలను ఆదేశించింది.
అవనిగడ్డ, ఫిబ్రవరి 6: ఒకటి కాదు రెండు కూడా మూడున్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగార అభరణాలు కలిగిన బ్యాగ్ను ఆటోలో పోగొట్టుకున్న బాధితుడికి అవనిగడ్డ ఎస్ఐ సందీప్ రెండు గంటల్లో ఆ బ్యాగ్ను అప్పగించి పలువురి అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఉప్పల నాగమణి అనే మహిళ గురువారం నాగాయలంకలో రేపల్లె వెళుతున్న ఆటో ఎక్కి అవనిగడ్డలో దిగింది.
సికిందరాబాద్, ఫిబ్రవరి 6: గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే కరోనా వైరస్ కలకలం రేగుతుండగా, దానికి తోడు నకిలీ డాక్టర్ వ్యవహారం తోడైంది. ఇకేముందీ రోగులు, సహాయకుల ఆందోళన మరింత రెట్టింపయ్యింది. గురువారం నకిలీ డాక్టర్ వ్యవహారం గుట్టురట్టు కావటంతో చిలుకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గాంధీ వైద్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నల్లగొండ, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామం ముగ్గురు బాలికల హత్యాచారం కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ గురువారం నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
నెల్లూరు లీగల్: బంగారు నగల కోసం పట్టపగలు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి తల్లీ, కుమార్తెను అతి దారుణంగా హత్య చేసినట్టు నమోదయిన కేసులో నిందితుడు షేక్ ఇంతియాజ్పై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతడికి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి సత్యనారాయణ గురువారం తీర్పు చెప్పారు. నెల్లూరు నగరంలో 2013లో సంచలనం కలిగించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.