S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/16/2020 - 04:44

మేడ్చల్, మార్చి 15: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహిళా ఉద్యోగిని దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లి మున్సిపల్ ప్రాంతంలో నివాసం ఉండే జంగిలి రాజ్‌కుమార్ భార్య జంగిలి సువర్ణ(33) మండలంలోని కండ్లకోయ పరిధిలోని డెలివరీ డాట్ కామ్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది.

03/15/2020 - 06:14

నెల్లూరు, మార్చి 14: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్న నిందితులను నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ భాస్కర్‌భూషణ్ శనివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

03/15/2020 - 05:56

తిరుపతి, మార్చి 14: తుపాకీతో కాల్చుకుని రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి నగరంలో శనివారం చోటు చేసుకుంది. బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన సిద్ధ రాము స్థానిక సుందరయ్య నగర్‌లోని దోబీ ఘాట్ వద్ద ఓ సమాధిపై పడుకుని తన తుపాకీతో తలపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు.

03/15/2020 - 05:55

పలాస, మార్చి 14: విజయవాడకు చెందిన డిగ్రీ విద్యార్థి మహమ్మద్ షాఖాత్ జానీ అనే డిగ్రీ విద్యార్థి మూడు కిలోల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు ఆర్‌పిఎఫ్ పోలీసులు శనివారం తెలిపారు. విశాఖ జిల్లా అరుకులోయలో గంజాయి కొనుగోలు చేసి సికింద్రాబాద్‌కు జానీ తీసుకెళ్తున్నాడు. అయితే విశాఖలో సికింద్రాబాద్ వెళ్లాల్సిన రైలు బదులు పొరపాటున ఒడిశా వెళ్లే రైలు ఎక్కాడు.

03/15/2020 - 02:32

పాయకాపురం, మార్చి 14: టిప్పర్ వేగానికి మరోప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా లారీలను నడుపుతూ కనీసం పక్కన ఎవరు వస్తున్నారో కూడా చూడనంత నిర్లక్ష్యాన్ని డ్రైవర్లు చూపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక విద్యార్థి లారీడ్రైవర్ నిర్లక్ష్యానికి బలై తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని మిగిల్చాడు. ఈ సంఘటన నున్న గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలోని వాంబేకాలనీలో చోటుచేసుకుంది.

03/15/2020 - 02:32

జి.కొండూరు, మార్చి 14: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందగా ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. మండల పరిధిలోని ఆత్కూరు శివార్లలో శనివారం ఈప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వెలగలేరు శివారు కొల్లేటిగూడెం గ్రామానికి చెందిన సరిపల్లి కుమారి (65), సుబ్బారావు (70) దంపతులు.

03/15/2020 - 02:31

కూచిపూడి, మార్చి 14: పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరుకు రూ.5వేలు లంచం తీసుకుంటూ మొవ్వ మండలం పెదముత్తేవి వీఆర్‌ఓ అరేపల్లి రవి శనివారం అవినీతి నిరోధక శాఖాధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన రైతులు మట్టా వీర రామప్రసాద్ తన తండ్రి పొలమైన 2.30 ఎకరాలను అన్నదమ్ములకు విడకొట్టుతున్న క్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలకై రూ.5వేలు డిమాండ్ చేశాడు.

03/15/2020 - 02:21

హైదరాబాద్, మార్చి 14: పాతబస్తీ బహదూర్‌రా పోలీస్టేషన్ పరిధిలోని కిషన్‌భాగ్ ప్రాంతం గుండా ప్రవహించే మూసి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నార్లు మృతి చెందారు. దీంతో జియాగూడా ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

03/15/2020 - 02:20

నేరేడ్‌మెట్, మార్చి 14: రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు బోగీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని బోగి దగ్ధమైన సంఘటన శనివారం మల్కాజిగిరి పరిధిలోని వౌలాలి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సికిందరాబాద్ నుంచి కాకినాడకు వెళ్లే రైలును మరమ్మతు నిమిత్తం శనివారం ఉదయం వౌలాలి రైల్వేస్టేషన్ నిలిపారు.

03/13/2020 - 05:12

న్యూఢిల్లీ, మార్చి 12: సుప్రీం కోర్టులో ఇక నుంచి పిటిషన్లన్నీ ఏ-4 సైజు పేపర్లపైనే అనుమతిస్తారు. పర్యావరణ పరిరక్షణతోపాటు, దైనందిన కార్యక్రమంలో యూనిఫార్మటీ(ఏకరూపత) ఉండేందుకు వీలుగా ఏ-4 సైజు పేపర్లను వాడాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలవుతుంది. ఆ రోజు నుంచి పిటిషన్లన్నీ కచ్చితంగా ఏ-4 పేపర్లపైనే దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఏ-4 సైజు పేపరు ఇరుపక్కలా ముద్రించవచ్చు.

Pages