S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/04/2016 - 07:58

హైదరాబాద్, ఆగస్టు 3: ఒక భూమిని అపార్టుమెంటు నిర్మించి ఫ్లాట్లలో వాటా పొందేందుకు ఇచ్చిన యాజమాని వినియోగదారుడు అవుతారని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం సెక్షన్ 2(1) (డి) కింద భూమి ఇచ్చిన వ్యక్తి వినియోగదారుడని, ఈ కేసులో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పులు చెల్లవని సుప్రీం కోర్టు పేర్కొంది.

08/04/2016 - 07:29

హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలో ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఇతర జాతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఐఐటి జెఇఇలో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంటర్ మార్కుల వెయిటేజీకి మంగళం పలకాలని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అపెక్స్ బోర్డు నిర్ణయించింది. అయితే ఐఐటి జెఇఇ రాయాలంటే అభ్యర్థులకు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు రావడం తప్పనిసరి.

08/04/2016 - 07:26

నాగార్జునసాగర్, ఆగస్టు 3: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహిద్దామని తెలంగాణ రాష్ట్ర డిఐజి అకుల్ సబర్వాల్ అన్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో బుధవారం రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖ డిఐజి స్థాయి నుండి డిఎస్‌పిల వరకు పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/03/2016 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 2: ఎట్టకేలకు తెలంగాణ ఎమ్మెట్-3 షెడ్యూలు ఖరారైంది. ఎమ్సెట్-2 పేపర్ లీక్ కావడంతో మరోసారి పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఎమ్సెట్ -3 పరీక్ష కన్వీనర్‌గా జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్యను నియమించింది. గతంలో జారీ చేసిన హాల్‌టిక్కెట్‌తోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావచ్చు.

08/03/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 2: గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల రెండు నదులకూ వరద తాకిడి ఎక్కువగా ఉంటుందని కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) హెచ్చరించింది. ఈమేరకు మంగళవారం సిడబ్ల్యుసి ప్రత్యేక వరద హెచ్చరిక జారీ చేసింది.

08/02/2016 - 04:59

హైదరాబాద్, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, నదులలోని ఇసుక తవ్వకాలకు పొక్లెయినర్లను వినియోగించడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దక్షిణాది జోన్ (చెన్నై) నిషేధం విధించింది. మాజీ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ పి జ్యోతిమణి, సభ్యుడు పి ఎస్ రావులతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

08/02/2016 - 05:03

హైదరాబాద్, ఆగస్టు 1: గోదావరి, కృష్ణా నదులపై ఉన్న జలాశయాలు మెల్లమెల్లగా నీటితో నిండుతున్నాయి. నీళ్లు పూర్తిగా అడుగంటిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గత నెలరోజుల్లో దాదాపు 36 టిఎంసిల నీరు చేరడంతో నీటినిలు 40 టిఎంసిలకు చేరింది. ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం ఏడు టిఎంసిల నీరు మాత్రమే ఉంది.

08/02/2016 - 04:15

హైదరాబాద్, ఆగస్టు 1: హరితహారం నిర్వహణను కొందరు ఉదాశీనంగా తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు బాగానే పని చేస్తున్నా, కొందరి నిర్లక్ష్యం వల్ల కార్యక్రమంలో వెలితి కనిపిస్తోందన్నారు. జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కార్యక్రమంలో బాగా పాల్గొన్నారో, ఎవరు పాల్గొనలేదో మంత్రులకు ఫోన్ ద్వారా సిఎం వివరాలు అందించారు.

08/02/2016 - 04:13

కరీంనగర్, ఆగస్టు 1: పురపాలికల్లో ప్రధానంగా 20 అంశాలను తీసుకుని ముందుకెళ్లేందుకు నిర్ణయించామని, వచ్చే జూన్ 2నాటికి కనీసం అందులో మూడోవంతైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు రాష్ట్ర ఐటి, పురపాలక మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. సోమవారం కరీంనగర్‌లో తొలిసారి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధికారులతో రాష్టస్థ్రాయి సమావేశం నిర్వహించారు.

08/02/2016 - 04:07

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాపాలు పెరిగిపోయాయని, ఆయన పాపాలను వదిలిపెట్టేది లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ హెచ్చరించారు. తెలంగాణ కేవలం కెసిఆర్ కుటుంబానికి మాత్రమే వచ్చినట్టుగా అనిపిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కెసిఆర్ చేస్తున్న పాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటిని ఎండగడుతామని ద్వజమెత్తారు.

Pages