-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి), సింగరేణి కాలరీస్తో తెలంగాణ ట్రాన్స్కో సోమవారం వేర్వేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సిఎం కె చంద్రశేఖర్రావు సమక్షంలో ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్రావు, ఎన్టీపీసీ జనరల్ మేనేజర్లు సివి ఆనంద్, ఎస్కె ఖర్, అడిషనల్ జనరల్ మేనేజర్ కె సుదర్శన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
హైదరాబాద్, జనవరి 18: మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి వచ్చేనెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్లో పర్యటించనున్నారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత, తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోదీ తొలి పర్యటన ఇది. ఇప్పటివరకు వివిధ కార్యక్రమాలకు నరేంద్ర మోదీని మూడుసార్లు ఆహ్వానించినా రాలేదని తెరాస ఇటీవల బిజెపిపై విమర్శలు ప్రారంభించింది.
హైదరాబాద్, జనవరి 18: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ (హెచ్సియు)లో పిహెచ్.డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనల సెగ ఢిల్లీని తాకింది. రోహిత్ ఆత్మహత్యతో వర్శిటీ విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్సియులో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
చౌటుప్పల్, జనవరి 17: సంక్రాంతి పండగ ముగిసింది. పల్లెలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగుముఖం పట్టడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయిం ది. ఇసుకేస్తే రాలనంతగా రహదారిని వాహనాలు పూర్తిగా ఆక్రమించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లతో ప్రయాణికులు అవస్థ పడ్డారు. టోల్గేట్ల వద్ద పరిస్థితి సరేసరి.
హైదరాబాద్, జనవరి 17: నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆదేశించారు. గోదావరి నదిలో తెలంగాణకున్న వాటామేరకు నీటిని సమర్ధంగా, సంపూర్ణంగా వాడుకోవడానికి అనుగుణంగానే ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేశామన్నారు.
హైదరాబాద్, జనవరి 17: జిహెచ్ఎంసి ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయినా కొన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా తేలలేదు. ఈనెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా ‘బి-్ఫరం’ అందుకున్నవాళ్లే తుది అభ్యర్థులు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 150 డివిజన్లకు సుమారు 3 వేల నామినేషన్లు దాఖలయ్యాయి.
మహబూబ్నగర్, జనవరి 16: ఆర్డీఎస్ ఎగువ ప్రాంతంలో తుంగభద్ర నదిపై కర్నాటక ప్రభుత్వం మరో ప్రాజెక్టును నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే తుంగభద్ర నుండి ఆర్డీఎస్కు (రాజోలిబండ) రావల్సిన నీటి కేటాయింపులు లేక ఒకపక్క ఆయకట్టుకు నీరందక ఆయకట్టు బీడు వారింది.
హైదరాబాద్, జనవరి 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో మిత్రపక్షాలైన తెలుగు దేశం- భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ‘చిచ్చు’ సద్దుమణగలేదు. ఆశావాహుల ఆందోళనలు, నిరసనలతో రెండు పార్టీల కార్యాలయాలు హోరెత్తాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన, బలమైన డివిజన్లను పంపకానికి ఎలా పెడతారంటూ రెండు పార్టీల్లోనూ ఆశావహులు, అనుచరులు నిలదీస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయ. రాజకీయ పార్టీల్లో రెబెల్స్ సంఖ్య పెరుగుతోంది. బలం లేదని టికెట్ ఇవ్వనన్నారు.. స్వతంత్రంగా మా బలమేంటో చూపిస్తామంటూ రంగంలోకి దిగుతున్న రెబెల్స్ బెడద అన్ని పార్టీలనూ పీడిస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరిరోజు కావడంతో శనివారం ఒక్కరోజే వెయ్యి నామినేషన్లు దాఖలయ్యాయ.
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామంలో ఉన్న పత్తి గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే సరికి పత్తి పూర్తిగా కాలిపోయిందని బాధిత పత్తి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.కోటి పత్తి ఆగ్నికి ఆహుతైందని తెలిపారు.