S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/13/2017 - 20:06

తెలుగు భాషకు, సాహిత్యానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశంలో అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. దాదాపు 2500 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్నా, మూలానే్వషణకు సంతృప్తికర నిర్ణయాత్మక ఆధారాలు అందుబాటులో లేవు. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన గాథా సప్తశతి అన్న ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు కనిపించాయి.

12/13/2017 - 20:05

ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే రాష్ట్రంలో తెలుగు భాషకు శాపంగా మారింది. నవ్యాంధ్రలో తెలుగు భాష అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సహేతుకం కాదు. ఎన్నికల ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలుగు భాషకు పూర్వవైభవం సహా పలు అంశాలను పేర్కొంది. అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడిచినప్పటికీ మేనిఫెస్టోలో తెలుగు భాషాభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చింది లేదు.

12/13/2017 - 20:05

రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. నేటికీ తెలుగుకు సరైన ఆదరణ లభించడం లేదు. ఆంగ్లం ప్రభావం ఉండటం వల్ల ప్రాధాన్యత తగ్గుతోంది. పరిపాలన, విద్యా బోధన తెలుగులోనే ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా తెలుగు మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగులోనే పాలన వ్యవహారాలు సాగాలని ఏకవాక్య ఆదేశాలు ఇచ్చారు.

12/13/2017 - 20:04

తెలుగు భాష అమలులో ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని చిత్తశుద్ధి లేదు. ఇంగ్లీష్ విద్యపై మోజుతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ మీడియం పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల పాఠశాలల్లోను తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా చేయాల్సివుంది. ఈ దిశగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరిగా చేయడం మంచి పరిణామం.

12/13/2017 - 20:04

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తెలుగు భాష అమలు తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే తెలుగు భాషపై ప్రజల్లో మమకారం పూర్తిగా తగ్గిపోయింది. మాతృభాష తెలుగుపై స్వాభిమానం పెంచుకునేందుకు కృషి జరగాలి. తెలుగు భాష, జాతి గొప్పది అనే భావం ప్రజల్లో వచ్చినప్పుడే తెలుగుకు పట్ట్భాషేకం కట్టినట్టవుతుంది.

12/13/2017 - 20:03

ఎంతో మధురమైన తెలుగు మృతభాషగా మారకముందే ప్రజలు, ప్రభుత్వం రెండూ మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా తమ భాషకు ఇచ్చే ప్రాధాన్యత చూసైనా తెలుగువారిలో మార్పు రావాలి. ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలకు, ప్రజల సహకారం ఉంటేనే తెలుగుకు మనుగడ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల పేర్లన్నీ తెలుగులోనే ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.

12/13/2017 - 20:03

ప్రభుత్వాధినేతల్లో చిత్తశుద్ధి లోపంవల్లే అధికార భాషగా తెలుగు అమలుకు నోచుకోవడంలేదు. మార్పు సచివాలయం నుంచే రావాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో కొనసాగిస్తే పాలనా సౌలభ్యం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయాని కొస్తే 7వ తరగతి వరకు బోధనా మాద్యంగా తెలుగును ప్రవేశపెట్టాలి. మాతృభాష సంస్కారాన్ని నేర్పితే.. పరభాష మానసిక బానిసత్వాన్ని కల్పిస్తుంది.

12/13/2017 - 20:02

నాగరికత ఉన్న ప్రతి జాతి మాతృభాష ద్వారానే ప్రపంచాన్ని చూస్తుంది. మాట్లాడుతుంది. మాతృభాషలో మాట్లాడకుండా, పరాయి భాషలో మాట్లాడే వారు ఎంతపెద్దవారైనా వారి భావ వ్యక్తీకరణలో లోపం కనిపిస్తుంది. మాతృభాష అంటే తల్లి భాష. మనం ఏ సమాజంలో అయితే జన్మించామో, ఆ సమాజంలో మన ఇంట్లోను, ఇరుగు పొరుగు, రాష్ట్రంలోను మాట్లాడే భాషను మాతృభాష అంటాం. మాతృభాష పట్ల చిన్న చూపు తగదు.

12/13/2017 - 20:02

గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఆంగ్ల మాద్యమానికి అలవాటుపడుతున్న వైనాన్ని దూరదృష్టితో పసిగట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. హళం పట్టి పొలం దున్ని జీవించిన బమ్మెర పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువధించిన గొప్పకవి.

12/13/2017 - 20:02

న్యాయస్థానాల్లో ఏ భాష వాడాలన్న అంశంపై స్పష్టమైన నియమావళి ఉంది. ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇంగ్లీషులోనే న్యాయమూర్తులు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. వాదోపవాదాలు ఇంగ్లీషులో సాగించాల్సి ఉంది.

Pages