S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/02/2016 - 04:47

గుంటూరు, ఏప్రిల్ 1: రాజధాని అమరావతిలోనిర్మాణమవుతున్న సచివాలయం గడువుకన్నా ముందే పూర్తవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం లో పని చేయడం కోసం హైదరామాద్‌నుంచి 12 వేల మంది తరలిరానున్నారని చెప్పారు. వేసవి కాలంలో మంచినీటి ఎద్దడిని అధిగమించేందుకు నిధుల కొరత లేదని నారాయణ అన్నారు.

04/02/2016 - 04:46

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పోలీసు శాఖను పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌పై విఐపిలు, వివిఐపిల భద్రత ఏర్పాట్ల భారం రోజు రోజుకీ పెరగడంతో పాటు నిఘాపరంగా పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించింది.

04/02/2016 - 04:44

గుంటూరు, ఏప్రిల్ 1: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించ తలపెట్టిన ఎయిమ్స్ (ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్) పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1618 కోట్లును ప్రకటించిన విషయం విదితమే. సుమారు 196 ఎకరాల స్థలంలో ఎయిమ్స్ ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. అందులో భాగంగా తొలుత 196 ఎకరాలకు ప్రహరి గోడ నిర్మించనున్నారు.

04/02/2016 - 04:42

తిరుమల, ఏప్రిల్ 1: టిటిడి నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు దుబాయ్‌కి చెందిన శైలేష్‌కుమార్ దాస్ రూ.కోటి 30లక్షలు శుక్రవారం విరాళంగా అందించారు. డోనార్స్ వింగ్ డిప్యూటీ ఇ ఒ రాజేంద్రకు ఇందుకు సంబంధించిన చెక్కును అందించారు.

చిత్రం శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.కోటి 30లక్షలు విరాళంగా అందిస్తున్న దుబాయ్‌కి చెందిన భక్తుడు

04/02/2016 - 04:41

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో కొత్తగా రెండు ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఏకీకృత చెక్‌పోస్టుకు రూ. 94.50 కోట్లు ఖర్చవుతుంది. నెల్లూరు జిల్లా తడ వద్ద బివి పాలెం, శ్రీకాకుళం జిల్లా కరపాడు గ్రామం వద్ద పురుషోత్తమపురంలో ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తారు.

04/02/2016 - 03:14

తిరుపతి, ఏప్రిల్ 1: టిటిడి పరిధిలోని విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల సత్రంలో అసాంఘిక కార్యక్రమాలను పాల్పడ్డ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపమాక ఆలయం వద్ద ఒక మహిళతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడిన విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారమైన నేపధ్యంలో ఇఒ తీవ్రంగా స్పందించారు.

04/02/2016 - 03:13

కొవ్వూరు, ఏప్రిల్ 1: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాల్టీలో 16వ వార్డు కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52) (టిడిపి) శుక్రవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఒక వివాహ విందుకు హాజరై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతిచెందారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గోపాలకృష్ణ మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

04/02/2016 - 03:11

విజయవాడ, ఏప్రిల్ 1: సీనియర్ రాజకీయ నాయకులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల ఎనిమిదవ తేదీన వరుపుల సుబ్బారావు, 11వ తేదీన జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరనున్నారు. జ్యోతుల నెహ్రూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకునిగా పనిచేశారు. ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేసి సంగతి తెలిసిందే.

04/02/2016 - 03:09

ఏలూరు, ఏప్రిల్ 1: రెండేళ్ల క్రితం వరకు విభజన అంటేనే నేతాశ్రీలు చిర్రెత్తుకొచ్చినట్లు విరుచుకుపడేవారు. కానీ ఆ కాలం మారిపోయింది. ఇప్పుడు విభజన కోసం అర్రులు చాస్తున్నవారి సంఖ్యే అధికంగా కన్పిస్తోంది. ఇంతకీ ఆ విభజనకు, ఈ విభజనకి తేడా ఉంది. అప్పట్లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులంతా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కోసం ఆరాటపడుతున్నారు.

04/02/2016 - 03:07

విజయనగరం, ఏప్రిల్ 1: విజయనగరం జిల్లానుంచి సబ్సిడీ బియ్యం పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతోంది. ఆ రాష్ట్రాల నుంచి గుట్కా, సిగరెట్లు, మద్యం జిల్లాకు తరలివస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది.

Pages