S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/16/2018 - 12:19

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ఆందోళన ఆరవ రోజుకు చేరుకుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలోనే సీఎం కేజ్రీవాల్‌ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు మద్దతుగా మంత్రులు సత్యేంద్రజైన్, సిసోడియా నిరాహార దీక్ష చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించి ఐఏఎస్ ఆఫీసర్ల సమ్మె విరమింపజేయాలని సీఎం డిమాండ్ చేశారు.

06/16/2018 - 04:21

ఫిట్నెస్ ఛాలెంజ్

06/16/2018 - 04:07

హైదరాబాద్ సింగరేణి సంస్థ చేపడుతున్న నూతన ప్రాజెక్టులు,వ్యాపార విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్ర రైల్వే, బొగ్గుగనుల శాఖ మంత్రి పీయూష్ గోయాల్ హామీ ఇచ్చారు.శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

06/16/2018 - 01:29

పాట్నా, జూన్ 15: వర్శిటీ విద్యార్థినులు ఎక్కడ ఎలాంటి లైంగిక వేధింపులు, దాడులను ఎదుర్కొన్నా తక్షణం నేరుగా రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేయవచ్చంటూ గవర్నర్ సత్యపాల్ మాలిక చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో రాజకీయ మాటల యుద్ధానికి తెరతీశాయి. వివిధ వర్శిటీలకు చెందిన విద్యార్థి సంఘాలతో రాష్ట్ర వర్శిటీల చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ మాలిక్ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఈమేరకు విద్యార్థినులకు పిలుపునిచ్చారు.

06/16/2018 - 01:26

న్యూఢిల్లీ, జూన్ 15: ఐదురోజులుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి తాజాగా ప్రధానికి లేఖ రాశారు. గత నాలుగు నెలలుగా జరుగుతున్న ఐఏఎస్ అధికార్ల సమ్మెను విరమింపచేయాలని ఆయన ఆ లేఖలో నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కొన్ని టీవీ ఛానళ్లలో వస్తున్న ‘ఏసీ సోఫా కా ధర్నా’ వ్యాఖ్యలకు, ‘వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి నేనిక్కడ ధర్నా చేయడంలేదు.

06/16/2018 - 01:26

జైపూర్, జూన్ 15: పోస్టుమాన్ నిర్వాకం వల్ల 1830 ఆధార్ కార్డులు పాత పేపర్ల కొనే డీలర్ వద్దకు చేరాయి. రాజస్థాన్‌లోని జాలుపురలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సతీష్‌కుమార్ అనే పోస్టుమాన్ తనకు కేటాయించిన ఆధార్ కార్డులు సక్రమంగా డెలివరీ చేసేవాడుకాదు. గత ఏడాది జనవరి నుంచి బట్వాడా చేయాల్సిన కవర్లు, కార్డులు అతడి వద్దే పేరుకుపోయాయి.

06/16/2018 - 01:24

శ్రీనగర్, జూన్ 15: పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయన రైఫిల్‌మ్యాన్ ఔరంగజేబ్‌కు సైన్యం నివాళులర్పించింది. కాగా బండిపొరా జిల్లాలోని పనాజ్ అడవుల్లో జరిపిన సైనిక చర్యలో అసువులు బాసిన రైపిల్ మన్వీంద్ర సింగ్‌కు కూడా సైన్యం నివాళులర్పించింది.

06/16/2018 - 01:23

న్యూఢిల్లీ, జూన్ 15: వచ్చే కొద్ది సంవత్సరాలలో భారతదేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. మిలియన్ల ప్రజలు భవిష్యత్‌లో నీటిలభ్యత లేక తీవ్ర ఇబ్బందులు పడబోతున్నారు. నీతిఅయోగ్‌కు చెందిన కాంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్ (సిడబ్ల్యుఎంఐ) ఈ మేరకు ప్రజలకు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తోంది.

06/16/2018 - 01:04

న్యూఢిల్లీ, జూన్ 15: దేశంలోని మారుమూల గ్రామాలకు టెక్నాలజీని తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టెక్నాలజీ విస్తరణకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని శుక్రవారం ఆయన తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతిక ఫలాలు అందించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.

06/16/2018 - 01:02

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో విడివిడిగా సమావేశం అయ్యారు. శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రిత్వ కార్యాలయంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు హోంశాఖ ఉన్నత అధికారులను కూడా గవర్నర్ కలిశారు.

Pages