వినియోగదారుడి ఇంటికే కూరగాయలు!
Published Tuesday, 19 July 2016నంద్యాల, జూలై 19: వినియోగదారులకు వచ్చే ఖరీఫ్ నాటికి నేరుగా రైతుల పొలాల వద్ద నుంచి కూరగాయలు అందేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశామని, మంచి నాణ్యమైన కూరగాయలు అందేలా చేస్తామని రాష్ట్ర మార్కెట్ శాఖ సిఇఓ రమణమూర్తి అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్యార్డును చైర్మన్ సిద్ధం శివరామ్తో కలిసి మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజార్ను పరిశీలించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.