-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, మే 13: గ్యాంగ్స్టర్ నరుూం కేసులో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు పోలీస్ అధికారులపై వేటు పడింది. రాజకీయ నాయకులపై విచారణ కూడా జరిగింది. అయితే తాజాగా సిఐడి, సిట్ జరుపుతున్న దర్యాప్తులో నరుూంతో లింకున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు 16 మంది అధికారులకు చార్జిమెమోలు జారీ చేశారు.
హైదరాబాద్, మే 13: తెలంగాణలో ప్రభుత్వ సమాచార టెక్నాలజీ వ్యవస్ధ, వెబ్సైట్లు హ్యాకింగ్ కాలేదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. తమ వ్యవస్థ మొత్తం నేషనల్ ఇన్ఫర్మేటింగ్ సెంటర్తో అనుసంధానమై పటిష్టమైన సైబర్ భద్రత కలిగి ఉండటం వల్ల హ్యాక్ చేయడం అసాధ్యమన్నారు. పోలీసు శాఖతో పాటు అన్ని శాఖలు ముందస్తు చర్యలు తీసుకున్నాయన్నారు.
హైదరాబాద్, మే 13:వీసా నిబంధనలు రూపొందించేప్పుడు భారతీయుల ప్రత్యేకతను గుర్తించాలని అమెరికా, ఆస్ట్రేలియాల దృష్టికి తీసుకు వెళ్లినట్టు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్ తెలిపారు. ప్రవాసీ భారతీయుల సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సింగ్ అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు.
హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ఎమ్సెట్ తొలి కీని శనివారం రాత్రి ఎమ్సెట్ కమిటీ విడుదల చేసింది. తొలికీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఆన్లైన్లో కమిటీ దృష్టికి తీసుకురావాలని కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య పేర్కొన్నారు. పోస్టులో, వ్యక్తిగతంగా వచ్చి ఇచ్చిన అభ్యంతరాలను స్వీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ఎమ్సెట్ తొలి కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
కొత్తూరు, మే 12: అతివేగమే అనర్థానికి దారితీసింది. ఐదుగురి ప్రాణాలు బలిగొంది. గురువారం అర్ధరాత్రి 12.30 సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఇండికా కారు బైపాస్ రోడ్డులో నిలిచివున్న లారీని ఢీకొంది. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇండికాలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.
హైదరాబాద్, మే 12: ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ను మూసి వేస్తే, నగరమంతా ధర్నా చౌక్గా మారుతుందని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ హెచ్చరించారు. ధర్నా చౌక్ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మూసి వేసి, నిరసనలు, ధర్నాలకు నగర శివారులోని ఏదైనా ప్రాంతాన్ని కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
నెల్లూరు, మే 12:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి ఇళ్లపై సిబిఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నెల్లూరులోని ఆయన అతిథిగృహంతోపాటు బెంగళూరు, హైదరాబాద్లలో వాకాటికి చెందిన ఇళ్లపై అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు.
హైదరాబాద్, మే 12: మూడేళ్లుగా మిగులు బడ్జెట్తోనూ, ఈ ఏడాది నగదు రహిత చెల్లింపులతో దూసుకుపోతున్న తెలంగాణలో సామాజిక అభివృద్ధి ఎంత? అంటే వంద ప్రశ్నలు తలెత్తే పరిస్థితి. చేసింది ఎంతో ఉందని చెప్పుకుంటున్నా, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ రూపొందించిన నివేదికను పరిశీలిస్తే చేయాల్సింది ఎంతో ఉందన్న విషయం అర్థమవుతోంది.
హైదరాబాద్, మే 12: మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మూడేళ్లుగా రికార్డు సృష్టిస్తోన్న తెలంగాణ, డిజిటల్ (నగదు రహిత) లావాదేవీల్లోనూ దేశంలోనే ప్రథమ స్థానాన్ని పదిలపర్చుకుంది. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు చెల్లించే వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లోనూ డిజిటలైజేషన్తో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
విశాఖపట్నం, మే 12: డొల్ల కంపెనీల పేరుతో భారీ మొత్తాన్ని తమ కంపెనీల్లోకి జమ చేసుకుని, వాటిని విదేశాలకు తరలించి, వైట్ మనిగా మార్చుకునేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది వ్యక్తుల బండారాన్ని ఆదాయపన్ను శాఖ బయటపెట్టింది. వీరిపై స్థానిక ఎంవిపి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ శుక్రవారం రాత్రి మీడియాకు విడుదల చేశారు.