-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
సోదర ప్రేమను ప్రతిబింబించే రాఖీ పున్నమి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్నా సంప్రదాయమే మిన్నగా భావించి రాఖీ కట్టించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాఖీలు కడుతున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు.
రాజమహేంద్రవరం: దాచుకోడానికి లేదు. వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిందే. గోదావరి నదికి వరద వచ్చిందంటే నిత్యం లక్షలాది క్యూసెక్కుల వరద జలాలు ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి పోవాల్సిందే. ఈ ఒక్క సీజనులోనే ఇప్పటివరకు సుమారు 1800 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. ఈ నీటితో రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు సాగుచేయవచ్చు. ఒక టీఎంసీ నీటితో కనీస స్థాయిలో 10వేల ఎకరాలను పండించవచ్చు.
విజయవాడ: మొబైల్ తయారీ రంగంలో దేశంలోనే నవ్యాంధ్ర రాష్ట్రం మొదటి స్థానం వైపు పరుగులు తీస్తోంది. త్వరలోనే మరిన్ని పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేనాటికి ఏపీలో ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అనేది లేనేలేదు. ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఇక్కడ తయారుకాలేదు.
అచ్యుతాపురం, ఆగస్టు 26: ‘మీ అందరి దీవనలతో మేము అధికారంలోకి వస్తే అక్కచెల్లెమ్మలందరికీ అండగా ఉండి రక్షణ కల్పిస్తా’నని వైఎస్సార్ అధినేత రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వచ్చిన జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. జగన్ అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పెద్ద ఏత్తున సెజ్ నిర్వాసితులు జగన్ను కలిసి సమస్యలపై విన్నవించారు.
విజయవాడ, ఆగస్టు 26: ప్రజల సంతృప్తి, సంతోషాలే ప్రభుత్వ ప్రాధామ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఆర్డీఏ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతోష నగరాల సదస్సుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెండోసారి అమరావతిలో నిర్వహించనున్న ఈ సదస్సు ప్రణాళికను వచ్చే వారం సీఆర్డీఏ సమీక్షలో అందజేయాలన్నారు.
కర్నూలు, ఆగస్టు 25: అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా బీజేపీకి సహకిరిస్తున్న అవినీతిపరుడు జగన్, రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్ను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దండుకున్న జగన్ ఆ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
నల్లగొండ, ఆగస్టు 25: శ్రీశైలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్కు చేరుతుండగా సాగర్ జలాశయం నీటి మట్టం శనివారం రాత్రికల్లా 571 అడుగులకు, 259 టీఎంసీలకు చేరింది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312 టీఎంసీలు. శ్రీశైలం నుంచి శనివారం రెండు గేట్లు ఎత్తి సాగర్కు 1లక్ష 28,493 క్యూసెక్కుల నీటిని వదిలారు.
మెదక్ టౌన్, ఆగస్టు 25: కలెక్టర్ సీసీ సిద్ధూ కలెక్టర్లా ప్రవర్తిస్తాడు. అమ్మో సీసీ సిద్ధూ అతనితో వేగలేం అంటూ కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ క్యాంప్ క్లర్క్ (సీసీ) సిద్ధూ వ్యవహార శైలిపై కలెక్టరేట్లో జోరుగా చర్చ జరుగుతుంది. సీసీ సిద్ధూ ఇబ్బందులు తాళలేక కలెక్టర్ కార్యాలయ చిరుద్యోగి ప్రదీప్ ఆత్మహత్యకు యత్నించిన విషయం విధితమే.
మానవపాడు, ఆగస్టు 25: భారత దేశ చరిత్రలో దేశాభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అని బీజేపీ రాష్ట్ర నేత కిషన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్వామిమూర్తి నివాళులు అర్పించారు.