-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
బాన్సువాడ రూరల్, నవంబర్ 19: కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు క్లియరెన్స్ తీసుకోనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివా రం బాన్సువాడ - బోధన్ రహదారిలో ఆర్టీసీ డిపో సమీపంలో ప్రధా న రహదారిపై 4కోట్లతో నిర్మించిన ఆర్అండ్బి వంతెనను మంత్రి ప్రారంభించారు.
పబ్లిక్ గార్డెన్లో ఆదివారం ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వనం జ్వాల నరసింహారావు రచించిన ఆయోధ్యకాండ మందార మకరందం పుస్తకావిష్కరణను శ్రీగురు మదనానంద సరస్వతీ స్వామీ గావించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, రిటైర్డు జడ్జి రామలింగేశ్వర్రావు తదితరులు పాల్గొన్న దృశ్యం
హైదరాబాద్/ ఉప్పల్, నవంబర్ 19: ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకుడు మొదటి భార్యకు ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటని నిలదీసిన మొదటి భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు ఆ ప్రబుద్ధుడు. దీంతో న్యాయం కోసం మొదటి భార్య తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
హైదరాబాద్, నవంబర్ 19: గోల్డ్ స్టోన్ ప్రసాద్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అండదండలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు విమర్శించారు. మియాపూర్ భూముల్లో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి సభను తప్పుదారి పట్టించారని ఆయన ఆదివారం పార్టీ నాయకుడు సుధాకర శర్మతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 19: స్ధానిక సంస్థలకు నిధులిచ్చే అంశంపై వాస్తవాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవద్దని పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సిఎం కెసిఆర్కు హితవు పలికారు. సీనియర్ రాజకీయ వేత్తగా కెసిఆర్ కొంచెం ఆలోచించి మాట్లాడాలని, వాస్తవాలను కాదని మాట్లాడ్డం మంచిది కాదని అన్నారు. ఈ మేరకు ఆయన సిఎంకు రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు.
హైదరాబాద్, నవంబర్ 19: డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 92 వ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్న ట్రైనీ సివిల్ సర్వెంట్స్కు స్పోర్ట్మీట్ నిర్వహించారు. పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్పుట్, దిస్క్త్రో, మ్యూజికల్ చైర్స్, టగ్-ఆఫ్-వార్ తదితర పోటీలు నిర్వహించారు.
హైదరాబాద్/ శంషాబాద్, నవంబర్ 6: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాగుబోతులు హంగామా చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఉద్యోగిని పట్ల మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు సమీపంలోని ట్రాఫిక్ ఔట్ పోస్టుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మద్యం మత్తులో ఉన్న నిందితులను పట్టుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్, నవంబర్ 19: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులైన కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో డిసెంబర్ ఒకటిన వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. ఆదివారం నాడిక్కడ వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
హైదరాబాద్, నవంబర్ 19: ప్రకృతి తత్వాన్ని చాటుతూ జీవన విలువలను చాటేదే బతుకమ్మ అని నిజామాబాద్ ఎంపి కె.కవిత అన్నారు. బతుకమ్మ అంటే బతకడానికి ధైర్యాన్ని ఇచ్చే అమ్మ అని పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ ప్రాంగణంలో ఉన్న పీస్ ఆడిటోరియటంలో బతుకమ్మ స్ఫూర్తి ప్రచారాన్ని కవిత ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబర్ 19: రోడ్డుమీద రోడ్డు వేస్తుండటంతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఒకవైపు రోడ్ల ఎత్తు ఏయేటికాయేడు పెరిగిపోతుండగా, మరోవైపు రోడ్లపక్కనే ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయ భవనాలు రోడ్డుకంటే కిందకు వెళ్లిపోతున్నాయి. 30-40 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు అప్పట్లో రోడ్డుకంటే రెండు నుండి నాలుగైదు ఫీట్ల పైబాగాన ఉండేవి.