-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
సూర్యాపేట, జనవరి 31: హరితహారం మొక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముచ్చట తీర్చింది. చిగురిస్తున్న కలల పథకం కలెక్టర్పై ప్రశంసల జల్లు కురిపించింది.
వనపర్తి, జనవరి 31: వనపర్తి జిల్లా కేంద్రంలోని సివి రామన్ కళాశాల హాస్టల్లో ఉంటున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి విద్యార్థిని కీర్తిప్రియ (17) సోమవారం రాత్రి చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందింది. వెంటనే చూసిన తోటి విద్యార్థులు అరవడంతో కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థినిని అక్కడి నుండి ఓ ప్రయివేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించింది.
మాక్లూర్, జనవరి 31: డ్రైవర్ అజాగ్రత్త కారణంగా స్కూల్ బస్సు కింద పడి అభంశుభం తెలియని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ముత్యంపల్లికి చెందిన కుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు సంతానం. వీరు నివాసం ఉంటున్న ఇల్లు ప్రధాన రహదారికి ఆనుకుని పక్కనే ఉంటుంది.
నారాయణపేటటౌన్, జనవరి 31: కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన వివాహితపై ఒక కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దీంతో బాధిత మహిళ నేరుగా ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్కు తన ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన వాంగ్మూలాన్ని చెప్పి కోర్టు బయట విలేఖరులకు ఈ ఘటనకు సంబందించిన వివరాలు వెల్లడించింది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది.
హైదరాబాద్, జనవరి 31:నగరంలోని పలు ప్రాంతాలకు వచ్చే వారం నుంచి ప్రతి రోజూ మంచినీటిని విడుదల చేయనున్నారు. తొలుత ఎంపిక చేసిన కొన్ని బస్తీల్లో రోజూ నీటిని విడుదల చేసి, అనంతరం దశలవారీగా నగరమంతటా రోజూ మంచినీటిని విడుదల చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కెటిఆర్ తెలిపారు.ప్రయోగాత్మకంగా ప్రతి రోజూ నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
సూర్యాపేట, జనవరి 31: పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపే జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ ఆవాసం మంగళితండాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...
సూర్యాపేట, జనవరి 31: కనికరించని ఖాకీల క్రూరత్వం... దారొదలని యమకింకరుల కిరాతకం... వెరసి ఓ వృద్ధురాలి ఆయుష్షు తీసింది. సిఎం కాన్వాయ్ బందోబస్తు నిండు ప్రాణాన్ని కాటికి చేర్చింది. భర్త ఆరాటం... భార్య పోరాటం... మానవత్వం ఎరుగని పోలీసుల ముందు మోకరిల్లింది...! సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
కరీంనగర్ (లీగల్), జనవరి 31: ఉన్నత ఉద్యోగం చేస్తూ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ నిందితుడైన విద్యుత్ శాఖ ఇంజనీర్ కొండ రాంచంద్రం (39)కు కరీంనగర్ స్పెషల్ ఎసిబి కోర్టు న్యాయమూర్తి భాస్కర్రావు మంగళవారం ఏడాది జైలుశిక్ష విధించారు.
హైదరాబాద్, జనవరి 31: సినీ నటి సమంత మంగళవారం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావును బేగంపేటలోని మంత్రి నివాసంలో కలిసి, చేనేత ఉత్పత్తుల ప్రచారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తెలంగాణ స్టేట్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ(టెస్కొ)తో కలిసి చేనేతకు ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ ఏర్పడిన తరువాత అంతా ఆత్మగౌరవంతో తమ పండుగలు జరుపుకుంటున్నారని, ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి ఆథ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. తెలంగాణలో గిరిజన పవిత్ర స్థలాలు, జాతరలు పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.