-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి(రూరల్), డిసెంబర్ 12: మాంగనీస్ క్వారీ కింద మోటార్ పనులు చేస్తుండగా ఇద్దరు కార్మికులపై పైనుంచి బండరాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది పంచాయతీ పరిధి బంకురువానివలసలో ఉన్న మాంగనీస్ క్వారీ పనులను చేసేందుకు కొంతమంది కార్మికులు మంగళవారం వెళ్లారు.
రామచంద్రపురం, డిసెంబర్ 12: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రామానుజన్ గణిత అకాడమి ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి గణిత పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫలితాలను మంగళవారం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెవివి సత్యనారాయణ విడుదల చేశారు.
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 12: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణంపై సీఆర్డీఏ అంతర్జాతీయ స్థాయిలో ఈనెల 14, 15వ తేదీల్లో రెండు రోజుల వర్క్షాప్ను నిర్వహించనుంది. విజయవాడలోని ఒక హోటల్లో జరిగే ఈ వర్క్షాప్లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ గుర్తింపు పొందిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లు, ఇంజినీర్లను ఆహ్వానించారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: రాష్ట్రంలో 16మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు సోమవారం రాత్రి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా బదిలీ అయిన డీఎస్పీల్లో ఎక్కువ మంది ఇంటిలిజెన్స్కు వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 12: చనిపోయినా.. విధులు నిర్వహించ వచ్చు.. అదేలా సాధ్యమంటే పోలీసుశాఖనే అడగాలి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఎందుకంటే ఏడాది క్రితం మరణించిన అధికారి ఇంకా బతికే ఉన్నట్లు, పోలీసుశాఖలో పని చేస్తున్నట్లు భ్రమలో ఉన్న ఉన్నతాధికారులు ఏకంగా బదిలీ పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని సవరణ ఆదేశాలిచ్చారు.
అమరావతి, డిసెంబర్ 12: ‘పదవులు తీసుకున్నవాళ్లు పనిచేయకపోతే ఎలా.. నామినేటెడ్ పదవులు ఇచ్చాం. అవి తీసుకున్న వాళ్లు కూడా సరిగా పనిచేయడం లేదు. రాష్ట్రంలో 40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు పనితీరు మార్చుకోవడం లేదు. వాళ్లను త్వరలో పిలిచి మాట్లాడతా.
విజయవాడ, డిసెంబర్ 12: ఇక ఏటా సూర్య ఆరాధన ఉత్సవాలు కూడా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో వివిధ విభాగాధిపతులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ దేవుడిని వివిధ రూపాల్లో పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమేమన్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రతి ఏటా ఏరువాక, జలసిరికి హారతి వంటి ఉత్సవాలతో పాటు ఈ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తామన్నారు.
విజయవాడ, డిసెంబర్ 12: ఇక నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు ఆన్లైన్లో ఉంచనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వెలగపూడిలో విభాగాధిపతులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులు, కేంద్రం విడుదల చేసిన నిధులు, ప్రాజెక్టు వివరాలు, భూసేకరణ, పునరాసానికి సంబంధించిన చేసిన ఖర్చు, చెల్లించాల్సిన మొత్తం వివరాలు ఆన్లైన్ ఉంచుతామని తెలిపారు.
విజయవాడ, డిసెంబర్ 12: పాత రేట్లకు పని చేయడం కష్టమని, రేట్లు పెంచాలని త్రిసభ్య కమిటీ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన ఉంచారు. అయితే ప్రస్తుతం కేంద్రం ఉన్న పరిస్థితుల్లో రేట్లు పెంచడం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ వ్యక్తం చేసింది. వర్కు కన్సార్టియం ఏర్పాటుకు కూడా త్రిసభ్య కమిటీ అంగీకరించలేదు.
విజయవాడ, డిసెంబర్ 12: ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణ తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సంక్రాంతి తరువాత నిర్వహించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ సూచించగా, జనవరిలో నిర్వహించేందుకు సీఎం విముఖత వ్యక్తం చేస్తూ, సదస్సు తేదీలపై ప్రకటనను వాయిదా వేశారు.