S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/02/2017 - 01:45

తిరుపతి, మే 1: ఏర్పేడు వద్ద గత నెల 21న జరిగిన దుర్ఘటనలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవిందవరం సర్పంచ్ చిరంజీవులు నాయుడుతోపాటు మరో ఏడుగురు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇసుక మాఫియా అగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మునగలపాల్యెం గ్రామస్థులు 16 మంది మృతి చెందగా 26 మంది గాయపడ్డ సంఘటన గత నెల 21న జరిగిన విషయం పాఠకులకు విదితమే.

05/02/2017 - 01:44

హైదరాబాద్, మే 1: అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు.

05/02/2017 - 01:44

ఆదోని, మే 1: వాడి-గుంతకల్లు రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వేలైన్ విద్యుదీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ ఓజా పేర్కొన్నారు. ఆదోని రైల్వేస్టేషన్‌ను సోమవారం తనిఖీచేసిన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. వాడి- గుంతకల్లు స్టేషన్ల మధ్య జరుగుతున్న విద్యుదీకరణ పనుల్లో పురోగతి ఉందన్నారు. ప్రస్తుతం సూగూరు వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు.

05/02/2017 - 00:17

విజయవాడ, మే 1: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమను తెలంగాణకు బదిలీ చేయాలని ఎపి అసెంబ్లీ సెక్రటరీని సోమవారం కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని శాఖల ఉద్యోగుల పంపకాల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం తెలిసిందే.

05/02/2017 - 00:17

విజయవాడ, మే 1: రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న వివిధ జెడ్పీటిసి, ఎంపిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జెడ్పీటిసి స్థానాలకు, 17 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు జెడ్పీటిసి స్థానానికి, కుక్కునూరు జెడ్పీటిసి స్థానానికి ఎన్నిక జరగనుంది.

05/02/2017 - 00:16

ఒంగోలు అర్బన్,మే 1:రాష్ట్రంలో అంగన్‌వాడి కేంద్రాలకు త్వరలో నూతన భవనాలను నిర్మించేందుకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నట్లు రాష్ట్ర శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత వెల్లడించారు.

05/02/2017 - 00:14

విజయవాడ, మే 1: 2019 సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ తెలిపారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గత నెల 29, 30న విశాఖలో జరిగాయన్నారు.

05/02/2017 - 00:14

గుంటూరు, మే 1: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ, కార్మిక వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులు ఎన్నో ఏళ్లుగా కనీస వేతనాలకు కూడా నోచుకోకుండా పనిచేస్తున్నా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు జీహుజూర్ అంటోందని ఆరోపించారు.

05/02/2017 - 00:13

విజయవాడ, మే 1: అవయవదానంపై భారీస్థాయిలో అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. సోమవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మంగళవారం నిర్వహించబోయే కార్యక్రమానికి 10వేల మందికి పైగా హాజరవుతారని స్పీకర్ చెప్పారు.

05/02/2017 - 00:13

విజయవాడ, మే 1: రాష్ట్రంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరైన ప్రచారం లేక ఆదరణకు నోచుకోవడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ నిర్వాహకులు కనీస శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు సమీక్ష సమావేశాల్లోనూ మంత్రి ఈ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Pages