S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/30/2016 - 03:36

శ్రీశైలం, సెప్టెంబర్ 29: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 200 టిఎంసిలు దాటింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో గత వారం రోజుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 883.10 అడుగులుగా నమోదైంది. ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 205.2258 టిఎంసిలుగా ఉంది.

09/30/2016 - 03:35

నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 29 : ఓబులాపురం - కృష్ణపట్నం పోర్టుకు వేస్తున్న రైల్వే లైను కాంట్రాక్టర్లు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తమని తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

09/30/2016 - 03:35

ఆనందపురం, సెప్టెంబర్ 29 : ఆనందపురం-తగరపువలస జాతీయ రహదారిపై వెల్లంకి వద్ద గురువారం రాత్రి ప్రమాదవశాత్తు లారీ ఇంజన్ నుండి మంటలు రావడంతో లారీసహా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికుల పోలీసుల కథనం ప్రకారం చెన్నై నుండి కోల్‌కతాకు 63 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల లోడుతో వెళ్తున్న లారీ వెల్లంకి వద్దకు వచ్చేసరికి ఇంజన్ నుండి మంటలు వ్యాపించడంతో డ్రైవర్ లారీని పక్కకు తీసి ఆపేశాడు.

09/30/2016 - 03:31

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: చత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురియవచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు.

09/29/2016 - 08:52

కర్నూలు, సెప్టెంబర్ 28: ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు ఇక సభ్యసమాజంలో తిరుగాడే అర్హత కోల్పోయాడని, జీవించి ఉన్నంతకాలం జైలులోనే గడపాలని కర్నూలు కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. కర్నూలు నగరానికి చెందిన పఠాన్ ఖాజాఖాన్(25)కు ఈమేరకు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.

09/29/2016 - 08:51

విశాఖపట్నం, సెప్టెంబరు 28: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంది. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నారు. విధిలేక ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, ప్రతిపక్ష వైకాపాతోపాటు విపక్షాలన్నీ చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూనే, హోదాపై పోరు కొనసాగిస్తున్నాయి. సరైన సమయంలో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

09/29/2016 - 08:53

విశాఖపట్నం, సెప్టెంబర్ 28: విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరిన ప్రయాణికుల నౌక ఎంవి హర్షవర్దనలో సాంకేతిక లోపం తలెత్తడంతో నడిసంద్రంలో నిలిచిపోయింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో విశాఖకు 14 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయిన ఈ నౌకకు మరమ్మతులు బుధవారం రాత్రికి కూడా కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

09/29/2016 - 07:26

హైదరాబాద్, సెప్టెంబర్ 28: జాతీయ స్ధాయిలో వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కాంలను ఆర్ధికంగా బలోపేతం చేయడం, పనితీరును మెరుగుపరచడం అనే అంశంపై గురువారం ఢిల్లీలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి. భవానీ ప్రసాద్ ప్రారంభిస్తారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఫోరమ్ ఫర్ రెగ్యులేటర్స్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.

09/29/2016 - 07:25

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వైద్య కళాశాలలు ‘బి’కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్లకోసం రెండవ కౌనె్సలింగ్ నిర్వహించాలని ఏపి ప్రైవేట్ వైద్య కళాశాలల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది.

09/29/2016 - 07:24

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రత్యేక హోదా పేరుతో జనాలకు చేరువయేందుకు విపక్షాలు వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనకు ప్రజల నుంచి ఆశించిన స్పందన లభిస్తున్నట్లు కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనస్పందన లేక, కార్యకర్తలే దిక్కయ్యారు. మాజీమంత్రులు అప్పట్లో కూరగాయల మార్కెట్లకు వెళ్లినా సంతకం చేసేవారే కరవయ్యారు.

Pages