-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయవాడ: విజయవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ (కోవిడ్-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ(సిటీ), మార్చి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్వేశ్వరరావు(నాని) తెలిపారు. త్వరలోనే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
హైదరాబాద్, మార్చి 4: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ 15వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ వాయిదా పడింది.
సూళ్ళూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)నుండి గురువారం ఇస్రో చేపట్టదలచిన జీఎస్ఎల్వీ - ఎఫ్ 10 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేచ్తూ ఇస్రో చైర్మన్ శివన్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన్నట్లు గురువారం సాయంత్రం 5.43 గంటలకు షార్లోని 2వ లాంచ్ప్యాడ్ నుండి జీఎస్ఎల్వి - ఎఫ్ -10 రాకెట్ ప్రయోగం జరగవలసిఉంది.
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన (షార్)లో జీఎస్ఎల్వీ ఎఫ్ -10 ఉపగ్రహ వాహననౌక ద్వారా జీ ఐ శాట్-1 ఉపగ్రహాన్ని 5న రోదసీలోకి పంపేందుకు షార్ సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎంఆర్ఆర్ ఆధ్వర్యంలో మంగళవారం రాకెట్ రిహార్సల్స్ అనంతరం కౌంట్ డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు మొదలుకానున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
సిద్దవటం, మార్చి 3: ఫిలిప్పైన్స్ దేశంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మేరువ శ్రీహరి(21) దుర్మరణం చెందా డు. ఈ విషయాన్ని విద్యార్థి చదువుతున్న కళాశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలపడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్రెడ్డిపై భూ కబ్జా కేసు బిగుసుకుంటోంది. శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి భూ కబ్జాలకు పాల్పడినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం నుండి, సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకనం, డాటా సేకరణ, ఫలితాల వెల్లడి, అనంతర కార్యక్రమాలపై ఈసారి ఎన్నడూ లేని రీతిలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించింది. పరీక్షలకు సంబంధించి గత మూడు నెలలుగా విద్యార్థులకు కౌనె్సలింగ్ నిర్వహిస్తోంది.
ఖమ్మం: మన ఇల్లు, మన వీధి, మన పట్టణం అనే భావనతో ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖల్లో మార్పు రావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో పర్యిటించారు.
విజయవాడ, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థలో 6,858 పశుసంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. నిర్దేశించిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే పశు సంవర్థక సహాయకుని పోస్టునకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.