-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 18: విలువైన ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు కబ్జాకోరుల బారినపడకుండా, అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకురానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండలాల్లో 10,938.76 ఎకరాల వరకు విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించిన కెసిఆర్ సర్కారు మరికొన్ని వేల ఎకరాలను గుర్తించే పనిలో ఉంది.
హైదరాబాద్, మార్చి 18: కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా, అలాంటిది ఏమీ లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొని సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్రెడ్డి చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చామని, కాపీని స్పీకర్కు అందజేశానని అన్నారు.
హైదరాబాద్, మార్చి 18: రాజకీయ నాయకులు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 18: రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ధాన్యం అప్పగిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. రబీ ధాన్య సేకరణకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం పౌర సరఫరాల భవన్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కేటాయింపులు, గోనె సంచులు వంటి సమస్యలపై చర్చించారు.
హైదరాబాద్, మార్చి 18: సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశం వివాదాస్పదం కావడం బాధాకరమని, వారసత్వ ఉద్యోగాల కల్పనలో రాజకీయం చేయొద్దని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 1981లోనే నాటి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) యాజమాన్యంతో వారసత్వ ఉద్యోగాలపై ఒప్పందం కుదుర్చుకుని అమలు చేస్తోందన్నారు.
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 99.6 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పరీక్షల కమిషనర్ డాక్టర్ సురేందర్రెడ్డి చెప్పారు. కాగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఇన్విజిలేటర్లను, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లను పరీక్షల బాధ్యతల నుండి తొలగించినట్టు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 18: శాంతి, భద్రతల విభాగంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఐపిఎస్ అధికారిణి కల్పన నాయక్కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అదే విభాగంలో ఆమెను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి)గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మార్చి 18: మత్స్య కార్మికులకు పంపిణీ చేసేందుకు 28 వేల కోట్ల చేపలను, 24 వేల కోట్ల రూపాయలతో ఖరీదు చేస్తారా?, ఇదేమి విచిత్రం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మేరకు చేపలు ఖరీదు చేశారో లేదో తెలియదు కానీ డబ్బులు మాత్రం విడుదల చేశారని ఆయన విమర్శించారు.
ఖైరతాబాద్, మార్చి 18: వెనుకబడిన తరగతుల సంక్షేమం పట్ల కెసిఆర్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే బిసి సబ్ప్లాన్ను తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బిసిల సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని, రాష్ట్రంలోని 112 కులాలకు చెందిన బిసిలను కెసిఆర్ సర్కారు వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు.
హైదరాబాద్, మార్చి 18: టిఆర్ఎస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన రూ.80వేల కోట్ల రుణాలపై శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2014 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ.61,710 కోట్లు ఉండగా, తాజా బడ్జెట్లో రూ. 1,40,052 కోట్లకు చేరుకుందన్నారు.