S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/11/2017 - 02:11

హైదరాబాద్, మే 10: తుమ్మల చెరువు-నడికుడి స్టేషన్ల మధ్య సబ్‌వే నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి మూడు రైళ్లు నడిచే సమయాల్లో మార్పులు జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 11, 18 తేదీల్లో విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజర్ రైళ్లు నడిచే సమయాల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది.

05/11/2017 - 02:10

విజయవాడ, మే 10: ఇటీవలి కాలంలో ఏ ఉద్యమంలో చూసినా వామపక్షాల ఐక్యత వర్థిలాలి.. అనే నినాదాలు మార్మోగుతున్నప్పటికీ వామపక్షాల విలీనం మాత్రం సాధ్యపడేది కాదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు.

05/11/2017 - 02:09

విశాఖపట్నం, మే 10: దక్షిణ కోస్తాను ఆనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. విశాఖలో బుధవారం ఉదయం 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను వాతావరణం కాస్త చల్లబడింది.

05/11/2017 - 02:09

న్యూఢిల్లీ, మే 10: హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. లోకేష్ మంత్రి అయిన అనంతరం మొదటి సారీ ఢిల్లీ పర్యటనలో పలువురి మంత్రులు, వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ కావలసి వుంది. అయితే ఈ ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు మరణించడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి తిరిగి వెళ్లిపోయారు.

05/11/2017 - 02:08

విజయవాడ, మే 10: రాజధాని అమరావతిలో వివిధ ఐకానిక్ భవనాలు సహా ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సుకు సంబంధించి డిజైన్ల పరిశీలనకు మంత్రుల బృందంతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ప్రముఖుల వసతి భవనాలు ప్రభుత్వ కాంప్లెక్సులో ఏర్పాటు చేస్తున్నారు.

05/11/2017 - 01:28

వెంకటాచలం, మే 10: బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు గ్రావెల్ గుంటలో పడి మృత్యువాత చెందగా, మరొక చిన్నారి సురక్షితంగా బయట పడిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ పరిథిలోని గొట్లపాళెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గొట్లపాళెం గ్రామానికి చెందిన ఉండ్రాళ్ల సురేష్ (12) అస్తోటి జాన్ (10) మరొక చిన్నారి కోలా నవీన్ కుమార్ ముగ్గురూ వీధిలో అటలాడుకుంటున్నారు.

05/11/2017 - 01:27

వరదయ్యపాళెం, మే 10: క్షణికావేశంతో ఓ తల్లి తన జీవితానే్న కాకుండా బంగారు భవితవున్న తన ఇద్దరు ఆడపిల్లల జీవితాలకు కూడా అంతిమ తీర్పు ఇచ్చి నీటిలోమునిగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం రామిరెడ్డి పాళ్యంలో బుధవారం జరిగింది. ఈ సంఘటన ఆగ్రామంలో విషాద ఛాయలను నింపాయి. తన బిడ్డలు, భార్య విగత జీవులయ్యారని తెలుసుకున్న ఆభర్త కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నాడు.

05/11/2017 - 01:27

ఒంగోలు అర్బన్,మే 10:పోలింగ్ బూత్‌స్ధాయినుండి పార్టీని బలోపేతం చేయాలని కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజులు పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక పద్మావతి ఫంక్షన్‌హాలులో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసమావేశానికి జిల్లాపార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.

05/11/2017 - 01:26

కడప, మే 10 : కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఓఎస్‌డి సత్యయేసుబాబు నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బంది దాడులు చేసి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ శివలింగం శ్రీ్ధర్‌తో పాటు మరో 14 మంది అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి ఎర్రచందనం దుంగలు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..

05/11/2017 - 01:26

విజయవాడ, మే 10: రాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 16న సమావేశం కానుంది. జిఎస్‌టి బిల్లును ఆమోదించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రెండు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రతిపాదించారు. అయితే అసెంబ్లీ కార్యాలయం బుధవారం జారీ చేసిన ప్రకటనలో తొమ్మిదవ సెషన్‌కు చెందిన రెండవ సమావేశం 16 ఉదయం 9.45 ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

Pages