-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయనగరం, జనవరి 23: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనలో 41 మంది దుర్మరణం కావడంపై కేంద్ర దర్తాప్తు బృందం (ఎన్ఐఎ), సిఐడి బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. బిశ్వాస్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఎన్ఐఎ బృందం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగిన కూనేరు రైల్వే కేబిన్ వద్దకు చేరుకున్నారు.
జగ్గయ్యపేట రూరల్, జనవరి 21: వ్యవసాయ రంగ శాస్తవ్రేత్త, పంగనామముల సమాఖ్య చైర్మన్ పంగనామముల వెంకట సూర్యప్రకాశరావు (96) శనివారం ఉదయం 10గంటలకు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన ఆహార ఉత్పత్తి రంగంలో పేరు గాంచిన శాస్తవ్రేత్త. ఆయనకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు, మనుమలు, మనుమరాండ్రు ఉన్నారు. సతీమణి దుర్గాంబ 2009లో మరణించారు.
విజయవాడ, జనవరి 22: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్కు క్షేమదాయకం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయనగరం, జనవరి 22: హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతులను గుర్తించడంలో సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఈ రైలులో ఇంజిన్ తరువాత జనరల్ బోగీ, స్లీపర్ కోచ్లు 2, ఎసి బోగీ, ఎస్ 7, ఎస్ 8 బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతులను గుర్తించడంలో జాప్యం జరిగింది. మరోపక్క ఈ రైలులో స్లీపర్ కోచ్లో కూడా సాధారణ ప్రయాణికులు ఉండటం గమనార్హం. మృతుడి వద్ద పిఎన్ఆర్ ఆధారంగా మృతులను కొంతమందిని గుర్తించారు.
విజయవాడ (కల్చరల్), జనవరి 22: ఇటీవలి కాలంలో తెలుగులో ప్రజారంజకమైన మంచి చిత్రాలు రాకపోవడం వల్లనే జాతీయ స్థాయిలో అవార్డులు సాధించలేకపోతున్నామని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తమిళం, మలయాళం, కన్నడంలో మంచి చిత్రాలు వస్తున్నాయని, అయితే పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నారు.
హైదరాబాద్, జనవరి 22: సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)లో 2,945 మంది పోలీస్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. టెక్నికల్ విభాగాల్లో అదనపు అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
హైదరాబాద్, జనవరి 22:జోనల్ విధానం రాజ్యాంగ సవరణతో ముడివడిన అంశం కావడంతో దీనిని రద్దు చేయడం ఇప్పట్లో సాధ్యిం కాదనే నిర్ణయానికి ప్రభు త్వం వచ్చినట్టు తెలుస్తోంది. జోనల్ వ్యవస్థ రద్దు అంత సులువు కాకపోవడంతో మరికొంత కాలం ప్రస్తుత విధానానే్న కొనసాగించడం ఉత్తమమని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్, జనవరి 22:జపాన్లోని ఒకటి రెండు నగరాలతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని చేసుకునేందుకు సహకరిస్తామని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్ తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు జపాన్లో పర్యటిస్తున్న కెటిఆర్ ఆదివారం సాయంత్రం రాయబారి సుజన్ చినాయ్ను కలిశారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా రూపొందించిన పాలసీలను, చర్యలను మంత్రి వివరించారు.
విజయనగరం, జనవరి 22: హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ఘోర దుర్ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది విద్రోహుల కుట్ర అని నిపుణులు అనుమానిస్తున్నారు. కూనేరు రైల్వే కేబిన్ వద్ద జరిగిన సంఘటనను పరిశీలిస్తే.. రైలు పట్టాలకు ఇరువైపుల సమాంతరంగా టంగ్ బ్రేక్ రావడాన్ని బట్టి విద్రోహచర్య అని భావిస్తున్నారు. రైలు స్పీడులో ఉన్నప్పుడు బ్రేకులు వేసినా రెండు పట్టా కమ్ములపై సమాంతరంగా విరగడం జరగదని చెబుతున్నారు.
కాకినాడ, జనవరి 22: కాకినాడ నగరాన్ని స్మార్ట్సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆరంభంలోనే ఇక్కడి అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కాకినాడ స్మార్ట్సిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నప్పటికీ సిటీ నిర్మాణానికి ఎంపిక చేయాల్సిన కన్సల్టెన్సీ ఎంపిక నుండే స్థానిక అధికారుల చేతివాటం మొదలయ్యింది.