-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయవాడ, జనవరి 8: రాష్ట్రంలో రెండు లక్షల బెల్టు షాపులను, 4500 ప్రభుత్వ మద్యం దుకాణాలను నడుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమిని మద్యం భూమిగా మారుస్తున్నారంటూ మాజీ పార్లమెంటు సభ్యురాలు, ఐద్వా జాతీయ నాయకురాలు బృందాకారత్ ధ్వజమెత్తారు. మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఒంగోలు అర్బన్,జనవరి 8:మాతృభాషను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వాన్ని పార్లమెంటు సభ్యులందరు నిలదీయాలని శాసనసభా ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి.
సింహాచలం, జనవరి 8: హిందూ ధర్మానికి, దేవాలయ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారే జీవోలను ప్రభుత్వం విడుదల చేయడం దుర్మార్గమైన చర్యగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాల ఆదాయంలో పన్ను చెల్లించాలని, విద్యానిధి కింద ఆదాయంలో ఒక శాతం దేవాదాయ శాఖకు జమ చేయాలని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై స్వామీజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్, జనవరి 8: సమాజాన్ని నిశిత దృష్టితో పరిశీలించి జనహితమే రచన ధ్యేయంగా మెరుగైన సమాజం నిర్మాణానికి ప్రజలను చైతన్య పరిచేందుకు కథలు రాస్తున్న కెవి రమణారావుకు ఈ ఏడాది చాసో స్ఫూర్తి 21వ పురస్కారాన్ని అందజేయనున్నట్టు చాసో ట్రస్టు ప్రతినిధి డాక్టర్ చాగంటి తులసి చెప్పారు.
కడప, జనవరి 8: ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతమైన కడపలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి డివి సదానందగౌడ హామీ ఇచ్చారు. కడప న్యాయవాదుల సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానందగౌడ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విజయవాడ, జనవరి 8: రాష్ట్భ్రావృద్ధిలో నిర్మాణ రంగంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కీలకపాత్ర వహిస్తుందనడంలో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే ఈ రంగాల్లో పనిచేసే వ్యక్తులు తాత్కాలిక ప్రయోజనాలకు వెంపర్లాడకుండా విశ్వసనీయతతో కూడిన పనితనం, నిర్వహణ చూపాలని నిర్మాణరంగ, రియల్ ఎస్టేట్ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఏలూరు, జనవరి 8: ‘నా బాధ్యతలేమిటో నాకెవరూ చెప్పక్కర్లేదు. కొంతమంది నేతలు జీవితాంతం రాజకీయాల్లో కొనసాగి, అధికారంలో ఉన్నప్పుడు ఈ డిమాండ్లు గుర్తులేక ఇప్పుడు నన్ను విమర్శించేందుకు వేదికలు వెతుక్కుంటున్నారు. కాపుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడే ఉంది. అందులో సందేహం లేదు’ అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, జనవరి 8: ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక అడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల మంజూరును నిలిపివేయలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే నిధుల లేమితో ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంటే, తాజా ఆదేశాలతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుగుదేశం ఎంపీలు వాపోతున్నారు.
హైదరాబాద్: నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు 12 వందలకు పైగా క్లాస్ వన్ కాంట్రాక్టర్లు, టర్కీ నిపుణులతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.