S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/23/2018 - 00:48

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రంలో కల్లు చెట్లపై (తాటి, ఈత, ఖర్జూర) ప్రభుత్వం వసూలు చేస్తున్న ‘చెట్లపన్ను’ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుప్రకటించారు. శాసనసభలో గురువారం వివిధ పద్దులపై చర్చ జరిగే ముందు ప్రత్యేకంగా గీతకార్మికుల సంక్షేమంపై ప్రకటన చేశారు. కల్లుచెట్లపై పన్ను రద్దు వల్ల ప్రభుత్వానికి ఏటా 16 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందన్నారు.

03/23/2018 - 03:35

హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగర్‌కర్నూలులోని తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు మెయిల్‌లో పంపించినట్టు తెలిసింది. అయితే నాగం పార్టీ వీడటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

03/23/2018 - 00:48

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ కానున్న మూడు స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగున్నాయి. మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరుగనుండగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు.

03/23/2018 - 00:25

విజయవాడ, మార్చి 22: ఆర్థిక నేరస్థులకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) గస్తీ కాస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తాను దేనికైనా రెడీ అని, రాష్ట్రానికి హోదా ఇచ్చి తీరాల్సిందేనని, ఆత్మగౌరవం కాపాడుకోవావని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధిష్ఠానం ఢిల్లీలో ఉందని, కానీ తనకు ఐదు కోట్ల ప్రజలే అధిష్ఠానమని స్పష్టం చేశారు.

03/23/2018 - 03:16

తిరుపతి, మార్చి 22: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ప్రపంచ ఆధ్యాత్మికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. గురువారం తిరుపతిలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 24వ తేదీన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ ధార్మిక సత్సంగ్, ముఖాముఖి ఉంటుందన్నారు.

03/23/2018 - 03:40

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధనం పూర్తిగా విజయవంతమైంది. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పిలుపులో భాగంగా 13 జిల్లాల్లోని జాతీయ రహదారులతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న రాష్ట్ర రహదారులను అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా దిగ్బంధించి ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు.

03/21/2018 - 23:30

రాజమహేంద్రవరం, మార్చి 21: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ సేనలను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టింది ‘మన్య విప్లవం’ నాటిక. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచైతన్య కల్చరల్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో ప్రదర్శించిన మన్యవిప్లవం సాంఘిక నాటిక ఆద్యంతం రక్తికట్టించింది.

03/21/2018 - 23:30

న్యూఢిల్లీ, మార్చి 21: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

03/21/2018 - 17:13

అమరావతి: పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై బీజేపి చేసిన దాడిపై టీడీపి ఎదురుదాడి దిగింది. ఇన్నాళ్లు మంత్రివర్గంలో ఉన్నపుడు బీజేపీకి అవినీతి కనిపించలేదా? అని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని నెహ్రు ప్రశ్నించారు. కేబినెట్ నుంచి బయటకు వచ్చాక అవినీతి కనపడిందా అని ప్రశ్నించారు. పోలవరాన్ని ఆపాలనే బిజెపి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని విమర్శించారు.

03/21/2018 - 17:12

అమరావతి: పట్టిసీమలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. బుధవారంనాడు ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నిధులు వృథా చేశారని పేర్కొన్నారు. రో.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయని, సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రూ.190 కోట్లు ఖర్చుపెట్టారని కాగ్ నివేదిక సైతం వెల్లడించిందని ఆయన అన్నారు.

Pages