S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2020 - 06:01

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై మిశ్రమ స్పందన వచ్చింది. తెనాస సభ్యులు బడ్జెట్ పద్దులు భేష్ అంటూ ప్రసంగించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు బడ్జెట్ నిధులు పంచిపెట్టే విధంగా ఉందన్నారు. రైతుబంధు పథకం ఉన్నోళ్ళకే పంచపెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

03/15/2020 - 06:00

హైదరాబాద్, మార్చి 14: ఈ నెల 16వ తేదీన ఇందిరా పార్కు వద్ద సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు తలపెట్టిన అఖిల పక్షం ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కరోనా వైరస్ కోవిడ్ 19 విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, హైకోర్టు సూచనల మేరకు ధర్నాలు, జనాలు గుమిగూడే అవకాశం ఉండే సదస్సులకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపినట్లు ఆయన చెప్పారు.

03/15/2020 - 06:00

హైదరాబాద్, మార్చి 14: ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకరూపంలో భారాన్ని పెంచుతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీలను , ఆస్తిపన్ను పెంచుతామని చెప్పడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో నిరసన తెలిపారు.

03/15/2020 - 02:02

హైదరాబాద్, మార్చి 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నుండి సంజయ్‌కుమార్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. అయితే, భారీ ర్యాలీలు నిర్వహించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన మేరకు ఎయిర్‌పోర్టు నుండి నిర్వహించతలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకున్నట్టు నేతలు చెప్పారు.

03/15/2020 - 02:00

హైదరాబాద్, మార్చి 14: కరోనా వైరస్‌పై కాంగ్రెస్ నేతలు దిక్కుమాలిన ప్రకటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటనతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీఎం వర్సెస్ భట్టి మధ్య వాగ్వాదం నెలకొంది.

03/15/2020 - 01:46

హైదరాబాద్/సికిందరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన బాధితుడికి గాంధీ ఆసుపత్రికి వ్యాధి నయం చేసి డిశ్చార్జి చేసి ఇంటికి పంపిన ఇరవై నాలుగు గంటల్లోనే మరో పాజిటివ్ కేసు వచ్చింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి అనుమానిత లక్షణాలుండడంతో అతనిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

03/15/2020 - 01:45

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా) వైరస్‌ను ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. శనివారం నాడు శాసనసభలో ఆయన ఒక ప్రకటన చేస్తూ రోజురోజుకూ కోవిడ్ ప్రభావం ఎక్కువవుతోందని, ఈ క్రమంలో వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. కోవిడ్ వైరస్‌పై ఎవరూ భయాందోళనకు గురికావద్దని, రాష్ట్రంలో ఎవరికీ కోవిడ్ రాలేదని, పాజిటివ్ కేసులన్నీ బయటి ప్రాంతాల నుండి వచ్చినవారివేనని పేర్కొన్నారు.

03/15/2020 - 01:43

హైదరాబాద్, మార్చి 14: ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఉండే వ్యక్తులకు కరోనా సోకకపోయినా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారి నుంచి

03/15/2020 - 01:40

హైదరాబాద్, మార్చి 14: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు (స్కూల్స్ నుంచి యూనివర్సిటీల వరకు), సినిమా థియేటర్లు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లు మూసివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలకు కూడా అనుమతి లేదని హెచ్చరించింది. ఈ నిషేధాజ్ఞలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

03/13/2020 - 06:17

హైదరాబాద్, మార్చి 12: దొంగల సింగారం గ్రామం పేరును ప్రగతి సింగారంగా మార్చాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. గురువారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ తమ గ్రామ ప్రజలు పేరును మార్చాలని కోరుతున్నారని, ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థించారు.

Pages