-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూలై 11: మహిళలు మక్కువతో ధరించే నేత, జరీ చీరలకూ జిఎస్టి పోటు తప్పలేదు. జిఎస్టికి తోడు చైనా పట్టు, పవర్లూమ్లు కలిసి చేనేత రంగంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన ముడిసరకుపై జిఎస్టిని విధించడంతో చేనేత రంగం సంక్షోభంలో పడింది. పన్ను పోటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు కోరుతున్నాయి.
పాకాల, జూలై 11: స్వల్పవివాదంలోజరిగిన ఘర్షణలో పూతల పట్టు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే సునీల్కుమార్, అతని బావమరిది రాజేష్ మరికొందరిపై పాకాల పోలీసులు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేశారు. పాకాల భారత మిట్ట 1వ క్రాస్లో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కుమార్, అతని తల్లి నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి పక్కనే్న ఎం.మునెమ్మ నూతనంగా ఇల్లు నిర్మిస్తోంది.
నంద్యాల టౌన్, జూలై 11: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్, వైకాపాకు చెందిన సుబ్బరాయుడు ఇంట్లో మంగళవారం రూ.6.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ గోపాలకృష్ణ, టూటౌన్ సిఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. వారికి ఇంట్లో దాచిన రూ.6,80,000 నగదు లభించింది. దీన్ని సీజ్ చేశారు.
విజయవాడ, జూలై 11: రాజధాని అమరావతి పరిధిలో ఏడు రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణ ప్రణాళికను విడుదల చేసింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం మంగళవారం చోటుచేసుకుంది. 962 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి ప్రణాళికను ప్రకటించింది.
అమరావతి, జూలై 11: పార్టీ నామినేటెడ్ పదవులు, పెన్షన్ వంటి పథకాలను సంతృప్తికర స్థాయికి తీసుకువెళ్లినందున ఇకపై పార్టీని పరుగులు పెట్టించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
అమరావతి, జూలై 11: పర్యావరణ సుస్థిర అభివృద్ధికి వ్యర్థ నివారణ వ్యవస్థ అనేది అత్యంత ముఖ్యమైనదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, పట్టణాల్లో వ్యర్థ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
విజయవాడ, జూలై 11: రాష్ట్రంలో పేదలందరికీ నిత్యావసర సరకులు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఏపి స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 అనుసరించి మొదటిసారిగా రాష్ట్రంలోనే ఏపి స్టేట్ ఫుడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
అమరావతి, జూలై 11: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తొమ్మిది హామీల్లో విశేషమైనది ఏమీ లేదు.. వాటి ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న దానికంటే అదనంగా చేకూరేది ఏమీ లేదని రాష్ట్ర సమాచారమంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు.
విజయవాడ, జూలై 11: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే దిక్కనే పరిస్థితులను అధికార, ప్రతిపక్ష పార్టీలు టిడిపి, వైసిపిలు కల్పిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా.. వంశపారంపర్య పాలనను ప్రత్యేకంగా రాష్ట్రానికిచ్చారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు.
విజయవాడ (కార్పొరేషన్), జూలై 11: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోను రద్దు చేయడమే కాకుండా ప్రస్తుతం ఆ జీవో ప్రకారం పిలిచిన టెండర్ల అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంగళవారం సమ్మె ప్రారంభించారు.