-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
చిత్రం.. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 17దేశాల నుంచి తరలివచ్చిన 6వేల మందికి పైగా కళాకారుల కూచిపూడి నృత్యం
విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 25:కూచిపూడి నృత్యం ప్రపంచంలోని అన్ని కళలలో అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నాట్యాన్ని నేర్చుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు ఇక్కడి వస్తుండటం గర్వకారణమన్నారు. కూచిపూడికి మరింత వైభవం తెచ్చే క్రమంలో అన్ని పాఠశాలల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
క్రిస్మస్ వెలుగుల్లో ప్రపంచం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కోట్లాది క్రైస్తవులు పండుగ ఆనందంలో తేలియాడుతున్నారు. శాంతి సందేశాలు, శాంటాక్లాజ్ల పలకరింపులతో ప్రార్థనా మందిరాల్లో సందడి నెలకొంది.
**
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు
-ఎడిటర్
హైదరాబాద్, డిసెంబర్ 24: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో చేరేందుకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్)ను వచ్చే ఏడాది మే 7వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 23 వ తేదీ వరకూ గడువు విధించారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: అవిభక్త ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకం ప్రక్రియను కమల్నాథన్ కమిటీ దాదాపు ముగించింది. ఇంతవరకు 153 శాఖల ఉద్యోగులను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులో 151 శాఖలకు సంబంధించి ఉద్యోగాల పంపకాన్ని ఆమోదిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మరో రెండు శాఖల ఉద్యోగుల పంపకాల జాబితాను గత గురువారం కేంద్రానికి పంపారు.
విజయవాడ, డిసెంబర్ 24: అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాయి. ముఖ్యంగా డాక్టర్ యశోదా ఠాకూర్, జ్యోతి చింతలపూడి ప్రదర్శించిన అష్టవిధ నాయికాస్ అభినయ విన్యాసం ఆహూతులను పరవశింపజేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 24: ఆరోగ్యం అందని ద్రాక్షగా మారిందని, వైద్య ఆరోగ్య రంగంలో సహకార వ్యవస్థ రావలసిన అవసరం ఉందని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆరోగ్య రక్షణ కేవలం ప్రభుత్వంపైనే వేస్తే సరిపోదని ఆయన చెప్పారు. హైదరాబాద్లోని మహిళా దక్షత సమితి స్థాపించిన బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ను ఆయన శనివారం ప్రారంభించారు.
విశాఖపట్నం, డిసెంబర్ 24: రహదార్లు భవనాల శాఖ (ఎలక్ట్రికల్ సబ్ డివిజన్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్పై అవినీతి నిరోధక శాఖ శనివారం దాడులు నిర్వహించింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు హైదరాబాద్లో డిఇఇ సుభాష్చంద్ర పాత్రో సహా, అతని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో జరిగిన దాడుల్లో రూ.5 కోట్లకు పైబడి అక్రమాస్తులు గుర్తించినట్టు ఎసిబి అధికారులు వెల్లడించారు.
విజయవాడ, డిసెంబర్ 24: స్వాస్థ్య విద్యావాహినితో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘స్వాస్థ్య విద్యావాహిని’ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వినూత్న రీతిలో ప్రజలకు ఆరోగ్య విద్య అందించడం స్వాస్థ్య విద్యావాహిని ప్రధాన ఉద్దేశమని చెప్పారు.