-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
కామారెడ్డి, నవంబర్ 11: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణమైనప్పటి నుండి కూడా నవంబర్ నెలలో ప్రాజెక్ టగేట్లు తెరుచుకున్న సంఘటనలు ఎప్పుడూ లేవు.
నిజామాబాద్, నవంబర్ 11: నిజాంసాగర్ ఆయకట్టు కింద 2.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత రబీ సీజన్లో పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుండి ఆరు విడతలుగా చివరి ఆయకట్టు వరకు నీటి తడులు అందించనున్నారు. ఈ మేర కు శనివారం స్థానిక ప్రగతిభవన్లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణ యం తీసుకున్నారు.
ధన్వాడ, నవంబర్ 11: మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్ద ఉన్న చెత్తకుప్పలో జాతీయజెండాలను పరేశారు. శనివారం గ్రామయువకులు కొందరు వాటిని శారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ, గ్రామపెద్దలకు సమాచారాన్ని అందించారు. దీంతో చెరువు వద్దకు వెళ్లి చెత్తకుప్పలో ఉన్న జాతీయజెండాలను పరిశీలించారు. అనంతరం వాటిని ఒకసంచిలో వేసుకుని పంచాయతీ కార్యాలయం లో ఉంచారు.
ఆదిలాబాద్,నవంబర్ 11: కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలను ఉన్నతీకరించి రానున్న మూడేళ్ళల్లో 12 వేల కోట్ల నిధులు ఖర్చుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
మహబూబాబాద్, నవంబర్ 11: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ డిసెంబర్ 9న వరంగల్కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించే దళిత, గిరిజన, బీసీ గర్జన బహిరంగసభకు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధినాయకురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే రాహుల్ వరంగల్ పర్యటన రెండుసార్లు వాయిదా పడింది.
హైదరాబాద్, నవంబర్ 11: అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇచ్చారా? అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ ఆర్సి కుంతియా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు.
హైదరాబాద్, నవంబర్ 11: ప్రముఖ రచయిత్రి నూపుర్ కుమార్ రాసిన ‘జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్’ కాఫీ టెబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుశనివారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. సిటీ పోలీస్ ఆవిర్భావం నుండి నేటి వరకు హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ పురోగతిని రంగుల (తైలవర్ణ) ఫోటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరచారు. నగరంలో గతంలో పోలీసులు గస్తీ తిరిగేందుకు సైకిళ్లను ఉపయోగించేవారు.
హైదరాబాద్, నవంబర్ 11: ఈనెల 28 నుంచి 30వరకు హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక, ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీలోని ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే ఈ సదస్సులో 180 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.
హైదరాబాద్, నవంబర్ 11: రాజధాని వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సదస్సు (జిఇఎస్-2017) మరో అత్యంత కీలక సమావేశానికి వేదిక కాబోతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, శే్వతసౌధం సలహాదారు ఇవాంకతో కీలక చర్చలు జరపనున్నారు. ఇవాంక కొద్ది కాలంగా మహిళా పారిశ్రామికతను ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో సేవా రుసుము (సర్వీస్ చార్జి) బిల్లులో కలిపి వసూలు చేయడం చట్టవిరుద్దమని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ సివి ఆనంద్ తెలిపారు. చట్టవిరుద్దంగా ఎవరైనా వసూలు చేసినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలువురు వినియోగదారుల నుంచి సేవా రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.