-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
జీడిమెట్ల, ఫిబ్రవరి 26: అమెరికాలో జరుగుతున్న జాతి వివక్ష దాడుల నియంత్రణకు అక్కడి ప్రభుత్వంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమెరికాలోని కేన్సస్లో జాత్యహంకార అమెరికన్ కాల్పుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వెంకయ్యనాయుడు, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి పరామర్శించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఎలాంటి గ్రేడ్ లేకుండా అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉస్మానియా యూనివర్శిటీ (ఒయు) శతాబ్థి ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
సమస్యలను పరిష్కరించకుండా ఉత్సవాల పేరుతో ఆడంబరాలకు పోవడం వల్ల విద్యార్థులకు ఒరిగిందేమిటని సిఎం కెసిఆర్ను నిలదీశారు.
పాపన్నపేట, ఫిబ్రవరి 26: ప్రపంచంలోనే రెండవ వనదుర్గామాత ఆలయంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన మెదక్ జిల్లా శ్రీఏడుపాయల వనదుర్గాదేవి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న శివరాత్రి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిగింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఇంటర్ మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఇంటర్ మీడియట్ బోర్డు ఒక యాప్ను రూపొందించింది. పరీక్షా కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ యాప్ విద్యార్థికి ఉపయోగపడుతుంది. పరీక్ష సెంటర్, అక్కడికి చేరుకునే దారి వంటి అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా విద్యార్థికి ఉపయోగపడయని ఇంటర్ మీడియట్ బోర్డ్ కమీషనర్ అశోక్కుమార్ తెలిపారు.
హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 26: హైదరాబాద్లో బోగస్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో జాబ్ మేళాలు నిర్వహిస్తూ కన్సల్టెన్సీలు మోసానికి పాల్పడుతున్నాయి. అభ్యర్థుల నైపుణ్యతను గుర్తించకుండా కొందరు మోసానికి పాల్పడితే..డబ్బే ప్రామాణికంగా అభ్యర్థులను పెడదారి పట్టిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఇఎన్సి) గణపతిరెడ్డి పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గణపతిరెడ్డి పదవీకాలాన్ని పొడిగించే ఫైల్పై ఆదివారం ముఖ్యమంత్రి సంతకం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణది పెద్ద దోపిడీ దారుల కుటుంబం అని, గద్వాల ప్రాంతంలో కల్లు, చీఫ్లిక్కర్ వ్యాపారాలన్నీ అరుణ కుటుంబ సభ్యుల గుప్పిట్లో ఉన్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డిలు ఆరోపించారు. టిర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై అరుణ అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
నిర్మల్, ఫిబ్రవరి 26: తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్రెడ్డికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, ఆయన ఓ బచ్చా అని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అభివర్ణించారు. ఆదివారం నిర్మల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26:సన్నాసులను సన్నాసి అనకుంటే ఇంకేమంటామని మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
కురవి, ఫిబ్రవరి 25: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయంలో శనివారం 1:34గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తజనం జయజయధ్వానాల నడుమ కల్యాణం కన్నుల పండువ గా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి అశేష భక్తజనం కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చి స్వామివారి సేవలో పునీతులయ్యారు.