S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/04/2016 - 05:32

హైదరాబాద్, నవంబర్ 3: దేశ సైనిక దళాలను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఆర్మీని రంగంలోకి దించడంపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన ‘తిరుగుబా టు’ ఆరోపణలపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. శనివారం నాడు ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ వివాదాల్లోకి సైనిక దళాలను లాగడం జాతీయ ప్రయోజనాలకే భంగకరమని అన్నారు.

12/04/2016 - 05:27

భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఒక చిరుత శనివారం 12 ఏళ్ల బాలుడిని చంపింది. దీంతో ఆగ్రహించిన గ్రా మస్థులు దాన్ని వెంటాడి హతమార్చారు. బస్తర్ జిల్లా కుండా గ్రా మంలోకి శనివారం ఉదయం ఒక చిరుతపులి ప్రవేశించింది. ఆరుబయట ఆడుకుంటున్న 12 ఏళ్ళ బాలుడిపై దాడి చేసి చంపింది. చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించిన సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అంతా కలిసి దాని వెంటపడ్డారు.

12/04/2016 - 05:23

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్‌లోని నగల దుకాణాలపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత అత్యధికంగా బంగారాన్ని అన్మిన పలు షాపుల వివరాలను ఐటి అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు అప్పగించారు. శనివారం నగరంలోని బంజారాహిల్స్, ఆబిడ్స్, పంజాగుట్ట, పాతబస్తీలోని కొన్ని నగల షాపులపై ఐటి అధికారులు మెరుపుదాడులకు దిగారు.

12/04/2016 - 05:22

అమరావతి, డిసెంబర్ 3: కుల రాజకీయాలకు పెట్టింది పేరయిన బెజవాడలో సంచలన సినీ దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ నిర్మించనున్న ‘వంగవీటి’ సినిమా విడుదలకు ముందే వివాదంగా మారుతోంది. సినిమా ప్రమోషన్, పబ్లిసిటీలో తనదైన శైలితో అందరినీ ఆకట్టుకునే వర్మ విడుదల చేసిన ఈ సినిమా టీజర్, ప్రత్యర్ధి సామాజికవర్గాలయిన కమ్మ-కాపులలో ఉత్కంఠ కలిగిస్తోంది.

12/04/2016 - 05:17

హైదరాబాద్, డిసెంబర్ 3: దేశంలో రానున్న రోజుల్లో నగదు రహిత కార్యకలాపాలే జరుగుతాయని, ఈ క్రమంలో అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండాలని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలని, లేని వారు తక్షణం తమ అకౌంట్లను ప్రారంభించాలని కేంద్ర మంత్రి సూచించారు.

12/04/2016 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 3: జాతీయ ప్రవేశ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల సిలబస్‌లో తెచ్చిన మార్పు లు మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే 2004లో ఎన్‌సిఇఆర్‌టికి రాయల్టీ చెల్లించి సిలబస్‌ను తీసుకుని వాటిని ఇంటర్మీడియట్ స్థాయిలో అమలుచేసింది. గణితం మినహా మిగిలిన విజ్ఞాన శాస్త్రాల్లో 10 నుండి 20 శాతం మేర సిలబస్‌లో మార్పు చేసి అమలులోకి తెచ్చారు.

12/04/2016 - 05:12

హైదరాబాద్/నాచారం, డిసెంబర్3: ఆంధ్ర, ఒడిసా సరిహద్దు (ఎఓబి) లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ కాదని, ఎన్‌కౌంటర్ పేరిట ప్రభుత్వమే మావోయిస్టులను దారుణంగా హత్య చేసిందని అఖిల భారత విద్యార్థి జెఎసి నిర్ధారించిందని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.

12/04/2016 - 05:11

హైదరాబాద్, డిసెంబర్ 3:హైదరాబాద్‌లో ఇండియా సాఫ్ట్ ఐటి ఎగ్జిబిషన్ 2017 నిర్వహించనున్నట్టు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో 75 దేశాల నుంచి 400 అంతర్జాతీయ కొనుగోలుదారు సంస్థలు పాలు పంచుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలకు భారత దేశం అగ్రగామి కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. త్వరలోనే ఐటి ఉత్పత్తుల విధానం ప్రకటించనున్నట్టు చెప్పారు.

12/04/2016 - 05:10

హైదరాబాద్, డిసెంబర్ 3: విత్తన నమూనా, అంకురోత్పత్తిపై ఐదురోజుల ప్రత్యేక వర్క్‌షాప్ ఈ నెల ఐదున హైదరాబాద్‌లోని పార్క్‌హోటల్‌లో నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. శనివారం ఇక్కడ అధికారిక ప్రకటన చేస్తూ, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాల పరీక్ష అసోసియేషన్ (ఇస్తా) ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు వివరించారు.

12/04/2016 - 05:09

రేణిగుంట, డిసెంబర్ 3: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరను శనివారం ఐటి శాఖ అధికారులు సోదా చేశారు. శనివారం ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం స్పైస్‌జెట్‌లో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈసందర్బంగా ఐటి శాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి బాలకృష్ణ సతీమణి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు.

Pages