-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఉన్నత విద్యా మండలి విభజన అనంతరం దాని ఆధీనంలోని నిధులపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఇరు రాష్ట్రాలూ దాదాపు 350 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న తెలుగు అకాడమి వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా తెలుగు అకాడమి ఆలనా పాలనా లేక ఏటా వంద కోట్ల రూపాయిల వరకూ నష్టపోతోంది.
తిరుమల, ఏప్రిల్ 26: ఆ యువతి మైనర్. ఆ యువకుడు వివాహం చేసుకుని భార్యకు విడాకులిచ్చి మైనర్ బాలికతో ప్రేమాయణంలో పడ్డాడు. వివాహానికి బాలిక తల్లితండ్రులు ససేమిరా అన్నారు. వారిద్దరూ ఇంటినుంచి పారిపోవడంతో తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు వెళ్లే యాత్రీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-రత్లాంల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. మే 2వ తేదీ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి నెం.07173 రైలు బయలుదేరి మరుసటి రోజు రత్లాంకు చేరుకుంటుంది.
తిరుమల, ఏప్రిల్ 25 : టిటిడి కల్యాణం పేరుతో మరో బృహత్తర కార్యక్రమాన్ని సోమవారం శ్రీకారం చుట్టింది. కల్యాణం పేరుతో వధూవరులకు ఉచిత వివాహాలను చేయాలని సంకల్పించింది. టిటిడి ఇవో సాంబశివరావు ఈ పథకాన్ని సోమవారం పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాద్లో పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయిలో ఇండో-యూకె ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించనున్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు కావాల్సిన స్థలం సమకూర్చడంతో పాటు ఇతర వౌలిక సదుపాయాలు కల్పిస్తామని సంబంధిత ప్రతినిధులకు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: ముఖ్యమంత్రితో పాటు ఐదుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసమే మార్పులు తప్ప రాజకీయ కారణాలు లేవని మంత్రులు చెబుతున్నారు. మంత్రుల శాఖల మార్పునకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మంత్రుల శాఖల మార్పునకు సంబంధించి గత రెండు వారాలనుంచి చర్చలు జరుగుతున్నాయి.
విజయవాడ, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్లమంది ప్రజలకు ఈ రాష్ట్ర కుటుంబ పెద్దగా అవసరమైతే కఠోర నిర్ణయాలు తీసుకుంటూ సమర్థవంతమైన, నీతిమంతమైన పాలనను అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రామరాజ్యాన్ని మరిపిస్తానని చెప్పకపోయినా నేటికీ సీతారాముల కల్యాణాన్ని, రామరాజ్యాన్ని ఎందుకు గుర్తుచేసుకుంటున్నారో తనకు బాగా తెలుసంటూ..
విజయవాడ, ఏప్రిల్ 25: పరిపాలనాపరమైన వ్యయం తగ్గించడానికి, ప్రజలకు మేలైన పరిపాలనను అమరావతి నుంచే అందించడానికి కేవలం 62 రోజుల్లోనే ప్రభుత్వ భవనాల తొలిదశను పూర్తిచేయగలిగానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం తెల్లవారుఝామున 4.01 గంటలకు ముఖ్యమంత్రి సచివాలయ తాత్కాలిక భవనాలను ప్రారంభించారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.
కడప, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో నడుస్తున్నాయని, ఇప్పటివరకు రూ.1458కోట్లు ఖర్చు పెట్టామని, తక్షణమే రూ.500కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం నిధుల కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతానన్నారు. ఈ ప్రాజెక్ట్కు వచ్చే ఏడాదికి రూ.1600 కోట్లు అవసరమని అన్నారు. ఒక్కరోజు ప్రాజె క్టు పనులు నిలిపితే రూ.3కోట్లు నష్టం వస్తుందని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: అసలే ఎండాకాలం. ఆపై వడగాడ్పులు. కనీసం గ్లాసెడు మంచినీరు ఇవ్వకపోయినా, కొనుక్కుందామనుకుంటే ఒక సీసా బీరుకు కూడా ఆంధ్రలో కటకట ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్టోస్ బ్రూవరీ సంస్ధ గోల్డెన్ ఈగల్ బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసేది. అయితే ఈ సంస్ధకు లైసెన్సు పునరుద్ధరణ కాలేదు.