S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/13/2016 - 02:36

హైదరాబాద్/చార్మినార్, సెప్టెంబర్ 12: బక్రీద్, గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, పోలీసు అధికారులతో కలసి పాతబస్తీలో పర్యటించారు.

09/13/2016 - 02:34

హైదరాబాద్, సెప్టెంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడురోజుల పాటు, కోస్తాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఈమేరకు ఐఎండి శాస్తవ్రేత్త ఎ.కె. సింగ్ పేరుతో హెచ్చరిక వెలువడింది. అల్పపీడనంతో పాటు ఉపరితల ద్రోణి మూలంగా భారీ వర్షాలు ఉంటాయని వివరించారు.

09/13/2016 - 01:28

విజయవాడ, సెప్టెంబరు 12: ‘రైతులు, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికోసం వివిధ పథకాలు రూపకల్పన చేస్తున్నాం. అవి సక్రమంగా అమలు జరగాలంటే, బ్యాంకర్లు సహకరించాలి. కానీ అది జరగడం లేదు. ప్రభుత్వ ఆశయాన్ని బ్యాంకర్లు అర్థం చేసుకోవడం లేదు. ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు కాకపోతే, స్వచ్ఛందంగా వైదొలగండి’ అని బ్యాంకర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

09/13/2016 - 01:34

నెల్లూరు, సెప్టెంబర్ 12 : నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం శక్తిమంతమైన బాంబు పేలింది. నగరం నడిబొడ్డున ఉన్న కోర్టు ఆవరణలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ పేలుడుతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు బాంబు శకలాలను, ఇతర ఆధారాలను సేకరించారు.

09/13/2016 - 01:12

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపట్టిన స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న నిర్మాణాలతోపాటు అనుబంధ నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.

09/13/2016 - 01:37

హైదరాబాద్, సెప్టెంబర్ 12: అమరావతి నిర్మాణంలో అక్రమాలకు తావులేని రీతిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఇరువురి మధ్య దాదాపు గంటకుపైగా సంభాషణ సాగింది.

09/13/2016 - 01:39

గుత్తి, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ పోస్టుల నియామకానికి మంగళం పాడనున్నట్టు తెలిసింది. ఈమేరకు చర్యలకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. కర్నాటక తరహాలో డ్రైవర్లతోనే సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే జరిగితే రాష్ట్రంలో దాదాపు 30వేల కండక్టర్ పోస్టుల నియమకాలు నిలిచిపోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

09/12/2016 - 06:53

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్ 3 ప్రవేశ పరీక్ష రెండు రాష్ట్రాల్లోనూ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రెండు రాష్ట్రాల్లో 66.25 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 91 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

09/12/2016 - 06:51

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అడవులను రక్షించుకోవడానికి, చెట్లను పెంచడానికి, వన్య ప్రాణులను కాపాడుకోవడానికి కంకణ బద్దులై పనిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11న నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎం తన సందేశాన్ని విడుదల చేశారు.

09/12/2016 - 06:49

కలిసొచ్చిన వానలు, సర్కారు ప్రకటనలు.. వెరసి ఈ ఖరీఫ్‌తో నిరుటి కరవు కష్టాల నుంచి గట్టెక్కేస్తామని ఆశించిన రైతుకు అడియాసలే మిగిలాయ. మూడో విడత రుణ మాఫీ బ్యాంకు ఖాతాల్లో జమ అయతే, ఖరీఫ్‌కు పెట్టుబడి కష్టం లేకుండా పోతుందని ఆశించిన రైతు చివరకు భంగపడ్డాడు. బడ్జెట్‌లో నిధులు కేటాయంచినా బ్యాంకులకు మూడో విడత మాఫీ మొత్తాన్ని సర్కారు జమ చేయకపోవడంతో, రైతుకు పంట రుణాలు అందకుండాపోయాయ.

Pages